ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య సేవల పెంపు.. ప్రజల ఆరోగ్య రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టు చర్యలు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 02:51 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోగుల తాజా పరిస్థితే విషయమై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో నిత్యం నమోదవుతున్న రోగుల వివరాలను వెల్లడించిన ఆయన, వాటి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమగ్రంగా వివరించారు. పలు ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు, ముత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు వంటి ఆరోగ్య సమస్యలు అధికంగా నమోదవుతున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాల ఏర్పాటు, మందుల సరఫరా మెరుగుదల, శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ (అవుట్ పేషెంట్) మరియు ఐపీ (ఇన్ పేషెంట్) సేవల వినియోగం గణనీయంగా పెరిగిందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ప్రజల నమ్మకం పెరిగిందని, ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడుతున్నాయన్నది ఇందుకు ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. రోగులకిచ్చే సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు అన్ని వైద్య సిబ్బందికి మార్గనిర్దేశం చేసినట్టు మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa