రాజస్థాన్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం అజ్మేర్లో గంటపాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంలోని రహదారులు అన్నీ నదుల్లా మారాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రభావిత ప్రాంతాల్లో ఖ్వాజా గరీబ్ నవాబ్ దర్గా ప్రధానంగా ఉంది. ఈ ప్రాంతాన్ని వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. సందుల్లోకి ఆకస్మికంగా నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదే సమయంలో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోతున్న ఘటన చోటుచేసుకుంది. ఆ దృశ్యం అక్కడ ఉన్న వారిలో ఎవరో కెమెరాలో రికార్డు చేయగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితుడి పరిస్థితిపై తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa