కడప జిల్లాలోని గండికోటలో జరిగిన మైనర్ బాలిక దారుణ హత్య తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ముందుగా ఈ కేసులో ప్రియుడే మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటాడని అందరూ అనుమానించారు. ఆ తర్వాత కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. మైనర్ బాలికతో పాటుగా ఆమె ప్రియుడిని కూడా హత్య చేసేందుకు స్కేచ్ వేశారని.. మూడు నెలల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నారనే సమాచారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
గంటికోట ఇంటర్ బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాలికను హత్య చేసేందుకు ముందుగానే ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలానే బాలిక హత్య కేసులో ప్రియుడు, ఆమె కుటుంబ సభ్యులు కాకుండా.. కొత్త వ్యక్తుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను హత్య చేయడానికి గత మూడు నెలలుగా రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. చనిపోయిన మైనర్ బాలిక.. గతంలో అనేక సందర్భాల్లో తన ప్రియుడితో కలిసి గంటికోటకు వెళ్లినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే బాలిక, ఆమె ప్రియుడిని హత్య చేయడానికి ప్రణాళిక రచించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉంటే చనిపోయిన మైనర్ బాలిక.. హత్యకు గురి కావడానికి మూడు రోజుల ముందు.. తన ప్రియుడితో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో వీరిద్దరూ ఎక్కడ.. ఎప్పుడు..ఎలా కలవాలి అనే అంశాలపై చర్చించుకున్నారా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ చాటింగ్ను బాలిక కుటుంబ సభ్యులు చూశారా.. అందుకే పక్కా సమాచారంతోనే ఈ హత్య చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
వారం రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. తర్వలోనే పోలీసులు పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కేసులో సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిన మైనర్ బాలిక శవమై కనిపించింది. గండికోటలో ఒంటిపై దుస్తులు లేకుండా మైనర్ బాలిక మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో ముందుగా మైనర్ బాలిక ప్రియుడినే ప్రతి ఒక్కరు అనుమానించారు. అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్ది విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి రాసాగాయి. మైనర్ బాలిక చనిపోయన రోజు.. తన ప్రియుడితో కలిసి బైక్ మీద వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కొంతసేపటి తర్వాత అతడు ఒక్కడే తిరిగి రావడంతో.. ప్రియుడే మైనర్ బాలికను హత్య చేసి ఉంటాడని అందరూ అనుమానించారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో అసలు నిందితుడు ఎవరో పోలీసులు వెల్లడించలేదు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa