ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక.. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో పేరు లేని వారికి దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం లభించింది. జూలై 23 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన పేరుతో ఈ పథకాన్ని అమలుచేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే రూ.6000తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14000 కలిపి అర్హులైన రైతులకు ఏటా రూ.20000 అందించనుంది. ఈ మొత్తాన్ని రూ.7000, రూ.7000, రూ.6000 చొప్పున మూడు విడతల్లో అందించనున్నారు.
ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసిన సమయంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయాలలో దీనిని ప్రదర్శిస్తున్నారు. అయితే అర్హులైన రైతులు అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాలో తమ పేరు లేకపోతే.. జూలై 23 లోగా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయాలని వ్యవసాయశాఖ సూచించింది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్155251కు ఫోన్ చేసి రైతులు తమ అర్హత స్థితిని తెలుసుకోవచ్చని తెలిపింది.
మనమిత్ర వాట్సా్ప్ గవర్నెన్స్ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది. 9552300009 కు తమ ఆధార్ నంబర్ వివరాలు పంపి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే అన్నదాత సుఖీభవ పోర్టల్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది. మరోవైపు పీఎం కిసాన్ యోజన డబ్బులు రావాలంటే e-KYC తప్పనిసరి. అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవటానికి పీఎం కిసాన్ పోర్టల్ఓపెన్ చేసి, Know Your Status అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత వివరాలు నమోదు చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే ఈ- కేవైసీ పూర్తి కాని రైతులు.. తప్పనిసరిగా ఈ- కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై నెలాఖరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన డబ్బులు పడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa