కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గతకొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి డీకే శివకుమార్కు పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.ఈ క్రమంలో మైసూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో డీకే శివకుమార్ ప్రస్తావన తేవడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మైసూర్లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ వేడుకలో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ హాజరయ్యారు. కానీ, తరువాత అత్యవసరంగా ఆయన బెంగళూరుకు వెళ్లిపోయారు. అనంతరం సిద్ధరామయ్య వేదికపై మాట్లాడుతున్న సమయంలో, కాంగ్రెస్ నేత ఒకరు శివకుమార్ పేరు ప్రస్తావించాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘డీకే శివకుమార్ ఇక్కడ లేరు కదా? మీరు వెళ్లి కూర్చోండి. మీరు గొప్ప లాయరు’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
‘‘ఇక్కడ వేదికపై ఉన్నవారి పేర్లే ప్రస్తావించాలి. ఇంటికెళ్లిపోయినవారి పేర్లు ఎందుకు చెప్పాలి? ఇది ప్రోటోకాల్. మీరు న్యాయవాదిగా ఇది అర్థం చేసుకోవాలి’‘ అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అధికార మార్పిడి కోసం సిద్ధరామయ్య – శివకుమార్ మధ్య వార్ జరగుతోన్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఇప్పటికే ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన అనంతరం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి హైకమాండ్ ఆయన్ని డిప్యూటీ సీఎం పదవికి ఒప్పించి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించింది.
ఒక దశలో సీఎం పదవి రొటేషన్ విధానంలో మారే అవకాశం ఉందన్న వార్తలు వినిపించాయి. కానీ అధికారికంగా ఏ నిర్ణయం ప్రకటించలేదు.కాగా, తరుచూ డీకే శివకుమార్ సీఎం పదవిపై తరుచూ తన మనసులో మాటను వ్యక్తం చేస్తూనే ఉన్నాారు. అయితే, సిద్ధరామయ్య పదవిలో కొనసాగుతుండటంతో శివకుమార్ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకూ సిద్ధూ, డీకే మధ్య విభేదాలు కొన్ని పబ్లిక్ కార్యక్రమాల్లో స్పష్టంగా కనిపించాయి. తాజాగా, మైసూరు వేదికపై చోటుచేసుకున్న ఈ సంఘటన, మళ్లీ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటను బయటపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa