జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని చాలా మంది అనుకుంటారు. కానీ, టికెట్ ధరలు చూసి వెనకడుగు వేస్తుంటారు. కొందరు ఏదైనా టూర్ వెళ్లేటప్పుడు తక్కువ ధరలో విమాన ప్రయాణం ఉంటే బాగుండు అనుకుంటారు. అలాంటి వారందరికీ ఇండిగో ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. అత్యంత తక్కువ ధరకే విమాన ప్రయాణం కల్పిస్తోంది. ఇండిగో సంస్థ మాన్సూన్ సేల్ మరోసారి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో కేవలం బస్ టికెట్ ధరకే ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ఈ మాన్సూన్ సేల్ ఫ్లైట్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.
ఇండిగో మాన్సూన్ సేల్ ..
దేశీయ మార్గాల్లో రూ. 1499కే విమాన టికెట్లు కల్పిస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో ఈ టికెట్ ధరలు వర్తిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని కడప నుంచి విజయవాడ ఫ్లైట్ జర్నీకి ఈ ఆఫర్ కల్పించింది. కేవలం రూ. 1499కే కడప నుంచి విజయవాడ, కడప నుంచి చెన్నై వెళ్లవచ్చు. అంతర్జాతీయ మార్గాల్లో చూసుకుంటే టికెట్ ధర రూ. 4399 నుంచి మొదలవుతున్నాయి. ఈ ప్రత్యేక మాన్సూన్ సేల్ జూలై 15, 2025 నుంచే ప్రారంభమైంది జూలై 21, 2025 అర్ధరాత్రి 12 గంటల వరకు టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఈ ఆఫర్ సమయంలో టికెట్లు బుకింగ్ చేసుకుని జూలై 22, 2025 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ప్రయాణానికి కనీసం 7 రోజుల ముందు టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే జూలై 22 నుంచి ప్రయాణం మొదలవుతుంది. అలాగే ఇతర ఆఫర్లు సైతం అందిస్తోంది. ఇండిగో స్ట్రెచ్ ఆఫర్ ద్వారా ఎక్స్ట్రా లెగ్ రూమ్ సౌకర్యం రూ. 9999 కే కల్పిస్తోంది. అలాగే దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రీ-పెయిడ్ అదనపు లగేజీపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అదనపు లెగ్ రూమ్ ఉన్న ఎక్సెల్ సీట్లను రూ. 500 అదనంగా చెల్లిస్తే అందిస్తోంది. అలాగే ఎంపిక చేసిన మార్గాల్లో 6ఈ ప్రైమ్, 6ఈ సీట్ సేవలపై 30 శాతం డిస్కౌంట్ కల్పిస్తోంది.
మాన్సూన్ సేల్ ఆఫర్ సమయంలో టికెట్లను ఇండిగో అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాల్, టికెట్ కౌంటర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ మాన్సూన్ సేల్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెబ్సైట్లో ఫ్లైట్ ఆఫర్స్ పేజీలోకి వెళ్లాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa