ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. భారత్,,, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు

sports |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 09:49 PM

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించడంతో ఈ మేరకు నిర్వాహకులు మ్యాచును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ప్రజల మానోభావాలను దెబ్బతీసినందుకు, భారత క్రికెట్ దిగ్గజాలకు అసౌకర్యం కలిగించినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.


పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టుతో క్రికెట్ ఆడకూడదని చాలా మంది మాజీలు డిమాండ్ చేశారు. దీనిపై బీసీసీఐకి కూడా విజ్ఞప్తి చేశారు. అయితే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో భాగంగా భారత్, పాక్ మ్యాచ్ ఉండేలా నిర్వహకులు షెడ్యూల్ చేశారు. దీనిపై భారత ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.


"అభిమానులకు సంతోషకరమైన క్షణాలు అందించడమే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ లక్ష్యం. ఈ ఏడాది పాక్ హాకీ టీమ్.. భారత్‌కు వస్తుందని విన్నాం. అలాగే ఇటీవల ఈ రెండు జట్లు వాలీబాల్ మ్యాచ్ ఆడాయి. వీటి దృష్ట్యా ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ నిర్వహించాలని అనుకున్నాం. కానీ ఇది కొందరు ఆటగాళ్లు, అభిమానుల మనోభావాలను గాయపర్చింది. వాటిని దృష్టిలో పెట్టుకుని మ్యాచును రద్దు చేశాం" అని డబ్ల్యూసీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.


ఇండియా ఛాంపియన్స్ టీమ్‌:


ఈ టోర్నీలో ఇండియా జట్టుకు యువరాజ్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్ , హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, పీయుష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్ధార్థ్ కౌల్, గుర్కీరత్ మాన్. జులై 18న మొదలైన ఈ టోర్నీ.. ఆగస్టు 2 వరకూ కొనసాగుతుంది. 2న ఫైనల్ జరగనుంది. ఈ టోర్నీలో రిటర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు మళ్లీ మైదానంలో మెరుపులు మెరిపించబోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa