ట్రెండింగ్
Epaper    English    தமிழ்

31 సెకన్ల వీడియోతో ,,తన ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చిన రిషభ్ పంత్

sports |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 09:50 PM

వికెట్ కీపింగ్ చేస్తూ.. లార్డ్స్ టెస్టులో గాయపడి మైదానానికి దూరమైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ .. నాలుగో టెస్టుకు ముందు ఫిట్‌నెస్ అప్‌డేట్‌ ఇచ్చాడు. జులై 23 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తన ఫిట్‌నెస్ అప్‌డేట్‌ ఇచ్చాడు పంత్. సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌తో పూర్తి క్లారిటీ ఇచ్చాడు.


తన గాయం గురించి క్లారిటీ ఇస్తూ.. 31 సెకన్ల వీడియోను పంత్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇందులో ఫుట్‌బాల్ ఆడుతూ, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఇందులో అతడు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా కదిలాడు. "ప్రశాంతతకు సౌండ్ ఉంటే, అది ఇలాగే ఉంటుంది" అని క్యాప్షన్ ఇచ్చాడు రిషభ్.


కాగా లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తూ తొలి రోజు ఆటలో గాయపడ్డ పంత్ ఆ తర్వాత మళ్లీ కీపింగ్ చేయలేదు. దీంతో ధ్రువ్ జురెల్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. కానీ రెండు ఇన్నింగ్స్‌లలోనూ పంత్ బ్యాటింగ్ చేశాడు. కానీ వేలు నొప్పి కారణంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. దీంతో అతడు నాలుగో టెస్టులో ఆడతాడా? లేదా అనే సందిగ్ధత నెలకొంది. అదే జరిగితే అది టీమిండియాకు ఎదురుదెబ్బే అని అంతా అనుకున్నారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తాను పూర్తి ఫిట్‌నెస్ సాధించానని పంత్.. పరోక్షంగా చెప్పేశాడు. అయితే అతడు వికెట్ కీపింగ్ చేస్తాడా? లేదా కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడా అన్నది తేలాల్సి ఉంది.


కాగా నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్టులో టీమిండియా గెలిస్తే.. సిరీస్‌ను సమం చేస్తుంది. దీంతో మాంచెస్టర్ టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa