ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ గత రాత్రి సమావేశం కావడం తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇవాళ విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమంలోనూ యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కేవలం 5 నిమిషాలు మాట్లాడాను. ఆయన విజన్, ఆలోచనా విధానం నాకు ఎంతగానో నచ్చాయి. అందుకే ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మేము సిద్ధమయ్యాం" అని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa