లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎంపీ మిథున్ రెడ్డి గురువారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డిని ఏ4గా సిట్ చేర్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి బెయిల్పై విడుదల చేయాలంటూ ఆయన తరఫు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తోన్న సిట్ కార్యాలయంలో ఈ నెల 19న మిథున్ రెడ్డి హాజరయ్యారు. సుమారు ఏడు గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు, అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు. అయితే, ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్స్ను ఆయా కోర్టులు కొట్టివేశాయి. దాంతో మళ్లీ ఇప్పుడు మిథున్ రెడ్డి లాయర్లు బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థను మాన్యువల్ విధానంలోకి తీసుకువచ్చారని, ఇందులో మిథున్ రెడ్డి పాత్రే కీలకమనే ఆరోపణలు ఉన్నాయి.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 బాలాజీ గోవిందప్ప ఇప్పటికే బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలంటూ సిట్కు ఆదేశాలు జారీ చేసి, తదుపరి విచారణను జూలై 29కి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన సిట్ పలువురికి నోటీసులు కూడా పంపింది. ఈ క్రమంలోనే శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఇవాళ నోటీసులు అందించారు. పీఎంఎల్ఏ చట్టం కింద కేసు దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జూలై 28 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు హైదారాబాద్లోని తమ కార్యాలయంలో హాజరు కావాలంటూ స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆంధ్రా గోల్డ్ బ్రాండ్ భారీగా కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa