ఆంధ్రప్రదేశ్ లిక్కం స్కాం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. డిజిటల్ యుగంలో కేవలం నగదు రూపంలో అమ్మకాలు చేశారని, ఇదంతా కేవలం బ్లాక్ మనీ కోసమే అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు.
గన్నవరం ఎయిర్పోర్టులో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మద్యం తయారీ నుంచి చివరి కొనుగోలు వరకు అవినీతి జరిగిందంటూ ఆమె ఆరోపించారు. ఇది కేవలం రూ. 3,500 కోట్ల మధ్యం స్కాం మాత్రమే కాదని, పన్నులు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనే కేవలం నగదుతో అమ్మకాలు చేశారన్నారు. డిజిటల్ యుగంలో కూడా నగదు అమ్మకాలు ఏంటని ఆమె ప్రశ్నించారు. నాన్ డ్యూటీ పేమెంట్లు మొత్తం బ్లాక్లోనే జరిగాయని.. ఈ మొత్తం వ్యవహారంపై సిట్ పూర్తి విచారణ చేపట్టాలని కోరారు.
బ్రాండెడ్ మద్యాన్ని నిలిపివేసి.. చీప్ లిక్కర్ను ప్రోత్సహించడమనేది కుట్రతోనే జరిగిందంటూ గత ప్రభుత్వంపై షర్మిల ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిట్ ఈ అంశాలపై దృష్టి పెట్టి.. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారో తేల్చాలని కోరారు. వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి.. కేవలం నగదు విధానం ద్వారానే మద్యం అమ్మకాలు ఎందుకు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై కూడా ఇటీవల తన విల్లు ఎక్కుబెట్టారు. మహాశక్తి పథకంపై కూటమి ప్రభుత్వం ఇక చేతులెత్తేసినట్లేనని ఆమె అన్నారు. మహాశక్తి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. మహాశక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిపేసినట్లేనని, సూపర్ సిక్స్లో ఒక సిక్స్కి పంగనామాలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. కేవలం మహిళల ఓట్లు దండుకోవడానికే ఈ పథకం మేనిఫెస్టోలో చేర్చారని.. ఆఱ్థిక అంచనా లేకుండానే గుడ్డిగా వేల కోట్ల హామీలు ఇచ్చారా? అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa