తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో చోట అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఈమధ్య కాలంలో మహిళా ఉద్యోగులు కూడా లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనంగా మారింది. ప్రతి రోజు అవినీతి అధికారులు పట్టుబడుతున్నా సరే.. మిగతా వారు ఏమాత్రం భయపడటం లేదు. లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నారు. తాజగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఏకంగా 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆ వివరాలు..
ఓ ఫుడ్కోర్టు వ్యాపారిని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేసి.. దానిలో అడ్వాన్స్గా రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవి కుమార్. అవినీతి నిరోధక శాఖ సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రవి కుమార్ జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో రవి కుమార్.. సర్కిల్ కార్యాలయం పరిధిలోని ఓ ఫుడ్ కోర్టు వ్యాపారిని బెదిరించాడు. ఫుడ్ కోర్టులో అక్రమాలు ఉన్నాయని తనకు సమాచారం అందిందని.. అందుకే తనకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. రవి కుమార్ బెదిరింపుల గురించి సదరు వ్యాపారి తమకు ఫిర్యాదు చేశాడని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈక్రమంలో ఏసీబీ అధికారుల సూచన మేరకు.. సదరు ఫుడ్ కోర్ట్ వ్యాపారి రూ.2 లక్షలు ఇచ్చేందుకు డిప్యూటీ కమిషనర్ రవికుమార్ను ఒప్పించారు. ఆ తర్వాత ఫుడ్ కోర్ట్ వ్యాపారి వెళ్లి.. రవికుమార్కు రూ.2 లక్షలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు.. ఆ డబ్బు ఎందుకు తీసుకున్నారని డిప్యూటీ కమిషనర్ను ప్రశ్నించారు. కానీ అతడు సరైన సమాధానం చెప్పలేక పోయాడని.. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
అయితే గత కొంత కాలంగా రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్పై ఫిర్యాదులు వస్తున్నాయిని ఏసీబీ అధికారులు తెలిపారు. కాని సరైన ఆధారాలు లేక పోవడంతో విచారణ జరుపుతూ వస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే.. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న డిప్యూటీ కమిషనర్ రవికుమార్.. మొదటి నుంచి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతూ.. విధులు సరిగా నిర్వర్తించడం లేదని పలువురు ఆరోపించారు. ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనంగా మారింది. లంచం తీసుకునే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa