ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు

Recipes |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 11:14 PM

వర్షాకాలం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఆరోగ్యానికి కూడా అంతే హానికరం. ఎందుకంటే ఈ కాలంలో వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. ప్రజలు త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అందుకే వర్షాకాలంలో తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో జబ్బుల బారిన పడుకుండా ఉండాలంటే ఏం తినాలో, ఏం తినకూడదో ఓ అవగాహన ఉండాలి. ఇక, సాధారణంగా పెరుగు ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే, వర్షాకాలంలో పెరుగు తినకూడదని ఆయుర్వేదం చెబుతుంది. ఈ సీజన్‌లో పెరుగు తింటే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు ఎందుకు తినకూడదు, తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


ఆయుర్వేదం ఏం చెబుతుంది?


సాధారణంగా భోజనం లేదా ఇతర రుచికరమైన వంటకాలతో పాటు ఒక గిన్నె పెరుగు తినడం చాలా మందికి ఉన్న అలవాటు. అయితే, వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల వాత, పిత్త, కఫ వంటి మూడు దోషాలు ఒకేసారి ప్రభావితమవుతాయి. ఇది అందరికీ మంచిది కాకపోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో వాత, పిత్త దోషాలు తరచుగా తీవ్రమవుతాయి. ఇది శరీరాన్ని దుర్భలంగా మారుస్తుంది. దీంతో సీజనల్ వ్యాధులు వస్తాయని నిపుణులు అంటున్నారు. వర్షాకాలంలో పెరుగు ఎందుకు తినకూడదో ఇప్పుడు చుద్దాం.


జీర్ణసమస్యలు


ఆయుర్వేదం ప్రకారం, పెరుగుకు చల్లని శక్తి ఉంటుంది. పెరుగు వంటి చల్లని, భారీ ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి బలహీనపడుతుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ కారణంగానే పెరుగులో చిటికెడు నల్ల మిరియాలు, వేయించిన జీలకర్ర లేదా తేనె కలపమని ఎల్లప్పుడూ సలహా ఇస్తారు. ఎందుకంటే పెరుగులో ఏం కలపకుండా తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగించవచ్చు.


రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది


ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో పెరుగు వంటి చల్లని శక్తి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చల్లని శక్తి ఉన్న ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో శ్లేష్మం అంటే కఫం ఏర్పడటం పెరుగుతుంది. ఇది పేగు ఆరోగ్యం మందగించడానికి దారితీస్తుంది. దీంతో, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా వివిధ రకాల అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.


శ్వాసకోశ సమస్యలు


వర్షాకాలంలో క్రమం తప్పకుండా పెరుగు తినడం వల్ల శరీరంలో శ్లేష్మం బాగా పెరుగుతుంది. ఇది ఛాతీలో పేరుకుపోయతుంది. దీంతో, జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యలు వస్తాయి. అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. వాతావరణంలో తేమ కారణంగా అనారోగ్యాలు, అలెర్జీలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


సరైన మార్గం ఏంటి?


ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినవచ్చు. అయితే, డైరెక్టుగా తినకూడదు. పెరుగు తినాలనుకుంటే చిటికెడు కాల్చిన జీలకర్ర పొడి, నల్ల మిరియాలు, నల్ల ఉప్పు లేదా తేనే కలిపి తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల శక్తిని సమతుల్యం అవుతుంది. అంతేకాకుండా పేగు ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa