ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జేడీ వాన్స్ చాలాసార్లు కాల్ చేశారు, కానీ... లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ

national |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 08:04 PM

జమ్మూ కశ్మీర్‌లోని ఏప్రిల్ 22న చోటుచేసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం (జులై 28న) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని చెప్పారు. ఈ విజయానికి గుర్తుగా భారత్ విజయోత్సవాలు చేసుకుందని అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు తనపై నమ్మకం ఉంచారని మోదీ తెలిపారు. అంతేకాదు, త్రివిధ ధళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడిచేసి ఊహలకు కూదా అందని విధంగా ఉగ్రవాదులను మట్టిలోనే కలిపేసిందని ,కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశామని ప్రధాని వ్యాఖ్యానించారు..


ఇదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి, సైన్యానికి అవసరమైన సమయాన కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ‘‘ప్రపంచం మొత్తం భారత్‌కు మద్దతుగా నిలిచింది... కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు’’ మోదీ ఆరోపించారు.దేశ భద్రత అత్యవసర సమయంలో ఉంటే, రాజకీయం కంటే దేశ ప్రయోజనం ముందు చూడాలని, కానీ కాంగ్రెస్ తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని విమర్శలు చేశారు. ‘‘భారత సైన్యం తక్షణ చర్యలు చేపట్టింది కానీ దేశంలో ఓ ప్రధాన పార్టీ దానిని గౌరవించకుండా మాట్లాడటం బాధాకరం’ అని అన్నారు. పాక్ అణు బెదిరింపులకు భయపడలేదని అన్నారు.


అలాగే, ‘‘భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకున్న సమయంలో ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేయాలని ప్రపంచంలో ఏ నేత కూడా మాకు చెప్పలేదు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు.. మే 9న అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ తనకు చాలాసార్లు ఫోన్ చేశారు కానీ తాను బిజీగా ఉన్నానని చెప్పినట్టు మోదీ అన్నారు. చివరకు ఆయన ఫోన్‌ కాల్‌కు స్పందించాను.. పాకిస్థాన్ భారీ దాడికి సిద్ధమైందని వాన్స్ హెచ్చరించారు.. దీనికి నేను బదులిస్తూ అదే జరిగితే పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుదని చెప్పాను.. అంతేకాదు పాకిస్థాన్‌కు ఎవరు సాయం చేసినా.. మద్దతు ఇచ్చినా చూస్తూ కూర్చోబోమని అన్నాను.. ఎటువంటి దాడికి దిగినా మేము చూసుకుంటామని వాన్స్‌కు స్పష్టం చేశాను’’ అని మోదీ అన్నారు.


తన రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ.. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు. మీడియా హెడ్‌లైన్లలో ఉండొచ్చేమో గానీ.. ప్రజలు హృదయాల్లో కాదననారు. పాకిస్థాన్‌కు చిరకాలం గుర్తుండిపోయే సమాధానం ఇచ్చామని, పాక్‌ డీజీఎం అర్ధరాత్రి ఫోన్‌ చేసి దాడులు ఆపాలని కాళ్లావేళ్లా బతిమిలాడితే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆత్మ నిర్భర్ భారత్‌పై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ప్రధాని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa