ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్.. ఉరిశిక్ష రద్దు కాలేదంటూ ప్రభుత్వ వర్గాల క్లారిటీ

national |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 08:23 PM

యెమెన్‌లో మరణశిక్ష పడిన భారతీయ మహిళ నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆమెకు పడిన మరణ శిక్ష రద్దు అయిందంటూ వార్తలు వచ్చాయి. భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ ఆఫీసు అధికారికంగా నిమిష ప్రియ మరణ శిక్ష రద్దు అయిందని ప్రకటించింది. కానీ ఈ వార్తలన్నీ అవాస్తవం అని తాజాగా తేలిపోయింది. నేరుగా కేంద్ర ప్రభుత్వమే ఈ వార్తలన్నీ తప్పుడువని పేర్కొంది. అలాగే నిమిష ప్రియకు మరణ శిక్ష రద్దు కాలేదని తేల్చి చెప్పింది.


యెమెన్ దేశస్థుడి హత్య కేసులో నిమిష ప్రియకు జులై 16వ తేదీన మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అక్కడి సర్కారు దీన్ని వాయిదా వేసింది. ముఖ్యంగా బ్లడ్ మనీపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఆ దేశం సానుకూలంగా స్పందించింది. అయితే ఈ బ్లడ్ మనీకి తాము ఎప్పటికీ అంగీకరించబోమని బాధిత కుటుంబం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు ఎటు వెళ్తుందోనని అందరినీలో ఉత్కంఠ పెరిగిపోయింది.


నిమ్మ తొక్కలకు వంటగదిలో దొరికే ఒక్కటంటే ఒక్క వస్తువు కలిపి వాడితే చాలు, మందార, గులాబీ మొక్కలకు పూలు విరగబూస్తాయి


ఇలాంటి సమయంలోనే నిమిష ప్రియ మరణ శిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సోమవారం రోజు అర్ధరాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటన చేసింది. భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఓ బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఆ బృందం యెమెన్‌ సర్కారుతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని.. చర్చలు ఫలించడంతో మరణశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం వెల్లడించింది.


ఈ నేపథ్యంలోనే ఆమె శిక్ష రద్దు చేయబడిందన్న వార్తలు ఆమె కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కొంత ఆశను కలిగించాయి. కానీ ప్రభుత్వం తాజా స్పష్టతతో ఆ ఆశలు నిరాశగా మారాయి. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖనే అధికారికంగానే ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ కేసులో మరణశిక్ష ఇంకా అమలులోనే ఉందని స్పష్టం చేసింది. ఆమె ప్రాణాలను కాపాడటానికి జరుగుతున్న పోరాటం ఇంకా ముగియలేదని పేర్కొంది. ఇలాంటి సున్నితమైన కేసులో.. తప్పుడు సమాచారం ప్రచారంలోకి రావడం వల్ల బాధితులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో వాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అత్యంత అవసరం అని చెప్పుకొస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa