ఆంధ్రప్రదేశ్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పలు పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిలో విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు, రీసెర్చ్వైపు ఆసక్తిపెంచే దిశగా.. 'విద్యార్థి విజ్ఞాన్ మంథన్' (వీవీఎం) ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కేంద్రం విజ్ఞాన భారతి, విజ్ఞాన్ ప్రసార్, ఎన్సీఈఆర్టీతో కలిసి ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తుంది. ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు ఉంటయి.. ఈ మేరకు ఏపీకి చెందిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఏపీలో ఆసక్తి ఉన్న విద్యార్థులు వీవీఎం (విద్యార్థి విజ్ఞాన్ మంథన్) ప్రతిభా పోటీల కోసం.. సెప్టెంబరు 30 వరకు వీవీఎం పోర్టల్లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇతర మీడియంలలో జూనియర్, సీనియర్ విభాగాల్లో ఆన్లైన్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అలాగే ఈ పరీక్ష కోసం చదువుకోవాలనుకునే వారికి ఆగస్టు 16 నుంచి వీవీఎం వెబ్సైట్లో పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 1న ముందుగానే ఓ మోడల్ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తారు. అంతేకాదు జూనియర్ కేటగిరిలో విద్యార్థులకు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు పరీక్ష నిర్వహిస్తారు. సీనియర్ కేటగిరిలో విద్యార్థులకు నవంబరు 19 నుంచి 23 వరకు వారికి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే విద్యార్థులకు ఈ షెడ్యూల్లో వారికి నచ్చిన తేదీల్లో పరీక్ష రాయొచ్చు. అయితే ఆ తర్వాత 2026 జనవరి 4న రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయి.
రాష్ట్ర స్థాయి పోటీలకు 20 మందిని.. జిల్లా స్థాయి పోటీల్లో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున.. స్కూల్ స్థాయి పోటీల్లో 18 మంది చొప్పున సెలక్ట్ చేస్తారు. వీరికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ఆన్లైన్లో ప్రశంసాపత్రం అందజేస్తారు. జిల్లాస్థాయి, స్కూల్ స్థాయి వారికి ఆన్లైన్లో ప్రశంసాపత్రం అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన 20మందికి ధ్రువపత్రం, జ్ఞాపిక, రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున డబ్బులు ఇస్తారు. ఒకవేళ వీరిలో ఎవరైనా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే.. వారికి ఒక్కొక్కరికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు చొప్పున ఇస్తారు. వీటితో పాటుగా ఏడాది పాటు నెలకు రూ.2 వేలు చొప్పున భాస్కరా స్కాలర్షిప్ పేరిట ఆ విద్యార్థికి డబ్బులు కూడా అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని.. స్కాలర్షిప్ పొందే అద్భుత అవకాశం ఉందన్నారు.. వెంటనే ప్రతిభా పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa