డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం గాల్లో ఉండగా భారీ కుదుపులకు గురైంది. దీంతో పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయితే భారీ కుదుపులు కారణంగా 25 మంది ప్రయాణికులు ఆస్పత్రి పాలయ్యారు. ఇక సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.తాజాగా డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానం.. 25 మంది ప్రయాణికులతో వెళ్తుండగా భారీ కుదుపులకు లోనైంది. విమానం సాల్ట్ లేక్ నుంచి ఆమ్ స్టర్ డామ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో పైలట్ ఒక్కసారిగా అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. విమానం భారీ కుదుపుల కారణంగా 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.బుధవారం.. సాల్ట్ లేక్ సిటీ నుంచి ఆమ్స్టర్డామ్కు డెల్టా ఎయిర్ లైన్స్ విమానం బయల్దేరింది. విమానంలో 275 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారని ఎయిర్లైన్ తెలిపింది. అయితే గగనతలంలో ఉండగా ఒక్కసారిగా విమానం అల్లకల్లోలానికి గురైంది. కుదుపులు కారణంగా ఇరవై ఐదు మంది ఆసుపత్రి పాలయ్యారని ఎయిర్లైన్స్ తెలిపింది. బుధవారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో విమానం సేఫ్గా ల్యాండ్ అయిందని పేర్కొంది. అగ్నిమాపక సిబ్బంది,.ఎట్టకేలకు విమానం సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై డెల్టా ఎయిర్ లైన్స్ కీలక ప్రకటన విడుదల చేసింది. కుదుపులు సహజం కానీ ఇలాంటి భారీ కుదుపులు అసలు ఊహించలేదని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa