ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా నుంచి చమురు కొనుగోలు.. ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 08:30 PM

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో కేంద్రం తెలివిగా ప్రతిస్పందించింది. ‘‘మా ఇంధన అవసరాలు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటాం’’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుక్రవారం చేసిన విమర్శలకు భారత్ కౌంటర్ ఇచ్చినట్టయ్యింది. భారత్‌– అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద కోసం చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అసహనం కలిగించే అంశమని రూబియో వ్యాఖ్యానించారు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘ ఇన్ని దేశాలు అందుబాటులో ఉన్నా, ఇంకా రష్యా నుంచే భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇది ఉక్రెయిన్‌పై మాస్కో కొనసాగిస్తోన్న యుద్ధానికి మద్దతు ఇవ్వడమే’’ అని ట్రంప్ ఆరోపించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో భారత చమురు దిగుమతుల్లో 35 శాతం రష్యా నుంచే వచ్చాయని ట్రంప్ అన్నారు. అమెరికా నుంచే చమురు కొనుగోలు చేయాలని ఆయన బహిరంగంగా డిమాండ్ చేశారు. ట్రంప్ పరస్పర సుంకాలు ప్రకటించడంతో పాటు రష్యా నుంచి ఆయిల్, ఆయుధాల కొనుగోలు చేసినందుకు ఇది జరిమానా అని అన్నారు.


కాగా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం ఆయిల్ కొనుగోలు ఆర్ధిక నిర్ణయమ స్పష్టం చేశారు., ఎవరైనా సరే తక్కువ ధరకు ఇస్తే, వాళ్లనుంచే కొనుగోలు చేస్తామని వ్యాఖ్యానించారు. కాగా, ఉక్రెయిన్‌తో సంఘర్షణకు రష్యా నుంచి భారత్ చాలా తక్కువ మొత్తం చమురు దిగుమతి చేసుకునేది. కానీ, 2023 నాటికి రష్యా రోజుకి 1.66 మిలియన్ బ్యారెల్స్ చమురు భారత్‌కు సరఫరా చేసింది. తక్కువ ధరలు, రవాణా ఖర్చులు మిగులు దీనికి కారణం.


ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ట్రంప్ భేటీలో అమెరికా నుంచి చమురు, గ్యాస్ మొత్తంలో కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించింది. అయితే, 2023 నాటికి భారత్‌కు రోజుకు 6.6 మిలియన్ బ్యారెల్స్ చమురు అవసరం. ఈ డిమాండ్ తగ్గట్టు సరఫరా అండాలంటే ఒక్క దేశం నుంచి దిగుమతి చేసుకుంటే సరిపోదు. ప్రస్తుతం భారత్ చమురు దిగుమతుల్లో ఇరాక్, సౌదీ అరేబియా, రష్యా మొదటి స్థానంలో ఉన్నాయి.


మరోవైపు, దాయాది పాకిస్థాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకుంది.. దీని ద్వారా పాక్‌కు పెట్టుబడులు పెంచుతూనే, భారత్‌పై ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అమెరికా చమురు సంస్థలు లబ్ది పొందడమే కాకుండా భారత్ రష్యా చమురు మీద ఆధారపడకుండా ఉండాలని ఆశిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa