ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం: 1700 మంది మృతి చెందిన సునామీ విపత్తు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 08:31 PM

ప్రపంచంలో అతిపెద్ద రైలు ప్రమాదం గురించి మీకు తెలుసా?
దాదాపు 1,700 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర రైలు ప్రమాదం 2004లో శ్రీలంకలో జరిగింది.ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్‌కు గురిచేసింది.26 డిసెంబర్ 2004న, సముద్రాదేవి (Samudra Devi) అనే రైలు, కొలంబో నుంచి గాలే నగరానికి వెళుతోంది.ఉదయం 6:30 గంటలకు కొలంబోలో ప్రారంభమైన రైలు, శ్రీలంక నైరుతి తీరంలో తెల్వట్ట (Telwatta) ప్రాంతం గుండా ప్రయాణించింది.ఉదయం 9:30 సమయంలో, రైలు పెరాలియా  గ్రామం సమీపానికి చేరిన సమయంలో, హిందూ మహాసముద్రంలో తీవ్ర భూకంపం సంభవించింది.ఈ భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు రైలు దారికి 200 మీటర్ల దూరంలోని తీరాన్ని తీవ్రంగా తాకాయి.మొదట అలల వల్ల రైలులోకి నీరు ప్రవేశించడంతో, ప్రయాణికులు భయంతో రైలు పైకి ఎక్కారు.అయితే కొద్ది క్షణాల్లోనే వచ్చిన మరొక భారీ అల, రైలును పూర్తిగా సముద్రంలోకి ముంచింది.రైలులో ఉన్న ఎనిమిది బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
*ఈ ప్రమాదంలో: సుమారు 900 మృతదేహాలు వెలికితీయబడ్డాయి 150 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు అధికారిక లెక్కల ప్రకారం 1,700 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa