కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం మహారాష్ట్రలోని నాగ్పూర్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఆదివారం ఓ ఆగంతకుడు ఫోన్ చేసి, గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్టు బెదిరించాడు. ఈ సమాచారంతో నగర పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమై, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.హుటాహుటిన గడ్కరీ నివాసానికి చేరుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇంటి ఆవరణతో పాటు లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఓ ఆకతాయి చేసిన నకిలీ కాల్ అని నిర్ధారణకు వచ్చారు.మరోవైపు, ఈ బెదిరింపు కాల్ను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ బృందాలు కొద్ది వ్యవధిలోనే నిందితుడి ఆచూకీని కనుగొన్నాయి. నాగ్పూర్లోని తులసి బాగ్ రోడ్డులో ఉన్న ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఉమేష్ విష్ణు రౌత్గా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకు ఈ బెదిరింపు కాల్ చేశాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa