భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. స్టార్ క్రికెటర్లు ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ .. వన్డే భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు 2027లో జరిగే వన్డే ప్రపంచకప్లో ఆడాలని ఆశపడుతున్నప్పటికీ.. బీసీసీఐ అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీని కోసం కొత్త రూల్ తీసుకొచ్చినట్లు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఆ నిబంధనను వారు పాటించకపోతే.. వారికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం కష్టమేనని సమాచారం. "దైనిక్ జాగరణ్" రిపోర్ట్ ప్రకారం.. "2027 వన్డే ప్రపంచకప్ జట్టులో కోహ్లీ, రోహిత్లకు చోటు గ్యారంటీ కాదు. వారు టీ20, టెస్ట్ మ్యాచ్లు ఆడటం లేదు కాబట్టి.. వారికి ప్రాక్టీస్ తక్కువగా ఉంటుందని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. ఈ కారణంగానే, బీసీసీఐ వారి ముందు ఒక పెద్ద షరతు పెట్టింది."
విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సిందే..
ప్రపంచకప్లో ఆడాలనుకుంటే.. కోహ్లీ, రోహిత్ తప్పనిసరిగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని బీసీసీఐ చెప్పినట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్లో టోర్నీ మొదలవుతుంది. ఒకవేళ ఈ టోర్నీలో వారు ఆడకపోతే.. వారిని ప్రపంచకప్ జట్టు కోసం ఎంపిక చేయకపోవచ్చని నివేదిక పేర్కొంది.
"2027 వన్డే ప్రపంచకప్ కోసం మేం వేసుకున్న ప్రణాళికల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సరిపోవడం లేదు." అని టీమ్ మేనేజ్మెంట్లోని ఒక వ్యక్తిని ఉటంకిస్తూ ఆ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఇద్దరూ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని అనుకున్నా.. సెలక్టర్లు అవకాశం ఇవ్వకపోవడంతోనే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారని కూడా ఆ నివేదిక చెబుతోంది. ఇంకా అదే రిపోర్ట్ ప్రకారం.. కోహ్లీ, రోహిత్ తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడటం కష్టమే. కాబట్టి.. అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీసే వారి అంతర్జాతీయ కెరీర్కు చివరిది కావచ్చని అంచనా.'
ఇప్పటికే కేఎల్ రాహుల్ సహా యువ ఆటగాళ్లు ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్ వంటి యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారు. ఇంగ్లాండ్లో టెస్ట్ కెప్టెన్గా గిల్ బ్యాటర్గా, సారథిగా అద్భుతంగా రాణించడం.. అతడిపై సెలెక్టర్లకు మరింత నమ్మకాన్ని పెంచింది. భవిష్యత్తులో గిల్ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు. అందుకే.. కొత్త ప్రణాళికల్లో భాగంగా.. సెలక్టర్లు 2027 ప్రపంచకప్ కోసం యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీ20, టెస్టుల్లో వచ్చిన మార్పులు ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా రానున్నాయి. ఈ పరిణామాలు కోహ్లీ, రోహిత్ల కెరీర్ను ప్రమాదంలో పడేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa