ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పడిపోయిన కోకో పంట ధర.. రైతుల్లో ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 03:10 PM

AP: చాక్లెట్ల తయారీకి వాడే ‘కోకో’ పంట మద్దతు ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ ఆఖరు వరకు కేజీ ధర రూ.500 పలికింది. ప్రస్తుతం ఆ ధర రూ.350కి పడిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌ ధర రూ.720గా ఉంది. గతంలో ఆ ధరకు అనుగుణంగా మద్దతు ధర కల్పించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీలో 75 వేల ఎకరాల్లో కోకో పంట సాగు ఉండగా.. ఏలూరులోనే 50 శాతంపైగా పంటను పండిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa