ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శక్తి పధకం.. ఆంధ్రప్రదేశ్ మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 14, 2025, 03:42 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకమైన సేవగా స్త్రీ శక్తి పథకం ను ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందనున్నారు. ఇది మహిళల ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, వారి సౌకర్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం తీసుకొంటున్న కీలక అడుగు అని చెప్పవచ్చు.
ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 5 గంటలకు విజయవాడ బస్ స్టాండ్ లో ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించిన వెంటనే జీరో ఫెయిర్ టికెట్లు జారీ అవ్వడం ప్రారంభమవుతుంది. ఈ పథకం ప్రకారం ఏపీలో నివాసం ఉంటున్న మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్ జెండర్ వారు అర్హులుగా ఎంపికయ్యారు. అర్హతకు అవసరమైన ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.
కానీ ఈ పథకం అన్ని బస్సులపై వర్తించదు. నాన్-స్టాప్ బస్సులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే పర్యాటక బస్సులు, సూపర్ లగ్జరీ, సప్తగిరి, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. అలాగే, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల మధ్య సర్వీసులు అందించే ఇంటర్ స్టేట్ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించబడదు.
అంతేకాకుండా మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు తప్పనిసరిగా తమ ఐడి కార్డులను తీసుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం మహిళల ప్రయాణాన్ని సులభతరం చేసి, వారికి మరింత స్వాతంత్ర్యం కల్పించే దిశగా ఒక మంచి ప్రయత్నంగా మారనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa