ట్రెండింగ్
Epaper    English    தமிழ்

70 మందికి ధృవీకరణ పత్రాలు అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 08:09 PM

ఓడీచెరువు మండల కేంద్రంలో ఏకల్ గ్రామోథన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పొందిన 70 మంది యువతీ, యువకులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో 2023 అక్టోబర్ లో ఈ శిక్షణ తరగతులు ప్రారంభించారు. మూడేళ్ళలో 500 మందికి శిక్షణ ఇవ్వడమే ఫౌండేషన్ లక్ష్యమని, త్వరలో బ్యూటీషియన్ కోర్సులను కూడా ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. గృహాల పరిసరాల్లో వృధా నీటితో మొక్కలు పెంచేందుకు మొక్కలు కూడా పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa