ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఆరోగ్య సమస్యలున్నవారు చికెన్ తినకూడదు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 11:56 PM

చికెన్ చాలా మందికి ఇష్టమైన వంటకం. నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరికి చికెన్ తినకుండా ఉండలేరు. మిగతా నాన్ వెజ్ వంటకాలతో పోలీస్తే చికెన్ ఎక్కువగా తింటుంటారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65 ఇలా రకరకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా బాడీ బిల్డింగ్‌పై పెరుగుతున్న క్రేజ్ కారణంగా యువతలో చికెన్ వినియోగం బాగా పెరిగింది. ఇక, చికెన్‌లో అనేక పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఫిట్‌నెస్ కోసం కష్టపడేవారు తమ డైట్‌లో చికెన్ భాగం చేసుకుంటారు.


చికెన్‌లో ప్రోటీన్‌తో పాటు విటమిన్ బి12, సెలినీయం, నియాసిన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి కండరాల పెరుగుదలకు, మెదడు పనితీరుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తికి సాయపడుతుంది. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు చికెన్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్లు పొరపాటున చికెన్ తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. చికెన్ ఎవరు తినకూడదో డైటీషియన్ పూజా సింగ్ (భాగ్య ఆయుర్వేద, ఢిల్లీ) చెప్పారు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.


అధిక యూరిక్ యాసిడ్, ఆర్థరైటిస్


డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం, చికెన్‌లో ప్యూరిన్ కనిపిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఆర్థరైటిస్, గౌట్ సంబంధిత సమస్యలు ఉన్నవారు చికెన్ తింటే, అది కీళ్లలో నొప్పి, వాపును పెంచుతుంది. అందువల్ల, ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు చికెన్ మితంగా తినాలి. లేదంటే తినడం మానేయాలి. ఇక, యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు కూడా చికెన్‌ను దూరంగా పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.


పౌల్ట్రీ ఉత్పత్తులంటే అలెర్జీ ఉన్నవారు


కొందరికి పౌల్ట్రీ ఉత్పత్తుల అంటే అలెర్జీ. అలాంటి వారు చికెన్, గుడ్డు తినకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. పౌల్ట్రీ ఉత్పత్తుల అంటే అలెర్జీ ఉన్నవారు చికెన్, గుడ్లు తినడం వల్ల శ్వాస సమస్యలు, చర్మంపై దద్దుర్లు, చిన్న ఎర్రటి మొటిమలు వస్తాయి. చికెన్ తిన్న తర్వాత చర్మంపై ఏదైనా దురద, మంట లేదా దద్దుర్లు కనిపిస్తే, అది పౌల్ట్రీ ఉత్పత్తులకు అలెర్జీకి సంకేతం. ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం ముఖ్యం.


జీర్ణ సమస్యలు


ఈ రోజుల్లో చాలా మంది జీర్ణసమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు చికెన్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఇప్పటికే జీర్ణసమస్యలతో బాధపడేవారు చికెన్ తినకూడదు. డైచికెన్ సరిగ్గా ఉడికించకపోతే, సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా అందులో కనిపిస్తుంది. ఇవి కడుపు నొప్పి, మలబద్ధకం, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు చికెన్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


గుండె రోగులు జాగ్రత్త


చికెన్‌లో ఇప్పటికే కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అధిక నూనె, సుగంధ ద్రవ్యాలతో వండినప్పుడు, దానిలో సంతృప్త కొవ్వు పరిమాణం పెరుగుతుంది. సంతృప్త కొవ్వు, అధిక కొవ్వు.. కొలెస్ట్రాల్ స్థాయిల్నిపెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.. గుండెకి ముప్పు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు చికెన్ మితంగా తినాలి. లేదంటే చికెన్‌కు దూరంగా ఉండాలి.


ఈ విషయాలు ముఖ్యం


* కొంతమంది చికెన్‌ను గరం మసాలా, ఉల్లిపాయ, వెల్లుల్లి, నెయ్యితో కలిపి వండి తింటారు. చికెన్‌ను ఎక్కువ గ్రేవీ లేదా కారంగా తింటే.. అది రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు గ్రిల్డ్ చికెన్ తింటే మంచిది. మసాలాలు, స్పైసీ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.


* చికెన్‌ను పూర్తిగా ఉడికించడం కూడా ముఖ్యం. పచ్చి చికెన్‌ను కనీసం 75°C లేదా 165°F ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. దీంతో, బ్యాక్టీరియాలన్నీ చనిపోతాయి. ఉడికించిన చికెన్ తెల్లగా, లోపల రసం లేకుండా ఉండాలి. దానిలో గులాబీ రంగు ఉండకూడదు.


* ఏ ఆహారం అయినా సరే మితంగా తినాలి. ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చికెన్‌ను మితంగా తినండి. ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa