తలస్నానం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు ఎక్స్ పర్ట్. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈ జాగ్రత్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించాలని సూచిస్తున్నారు. లేదంటే జుట్టు రాలడంతో పాటు మరెన్నో సమస్యలు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా ఓ 5 జాగ్రత్తల గురించి చెప్పారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
గోరు వెచ్చని నీళ్లు
చాలా మందికి వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం అలవాటు. ఇలా చేస్తే రిలీఫ్ వస్తుందని అనుకుంటారు. కానీ.. మరీ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తప్పవు. ముఖ్యంగా తలస్నానం చేసే సమయంలో పొరపాటున కూడా వేడి వేడి నీళ్లు వాడకూడదని చెబుతున్నారు ఎక్స్ పర్ట్. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ పాడవడంతో పాటు కుదుళ్లు చెడిపోతాయి. వెంట్రుకలు చిట్లి పోతాయి. చాలా త్వరగా జుట్టు రాలే ప్రమాదం ఉంటుంది. అందుకే..వీలైనంత వరకూ గోరు వెచ్చని నీటితోనే తలస్నానం చేయడం మంచిదని డాక్టర్ సూచిస్తున్నారు. తలస్నానం చేసే సమయంలో షాంపూ కళ్లలోకి వెళ్లకుండా కాస్త తల వెనక్కి ఉంచితే మంచిది. దీని వల్ల నీళ్లన్నీ వెనక్కి వెళ్లిపోతాయి. మరీ హార్డ్ గా ఉండే షాంపూలు వాడకపోవడమే మంచిది.
వారానికి 2,3 సార్లు
మీరు వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేస్తారు. ఈ ప్రశ్న అడగడానికి ఓ రీజన్ ఉంది. ఎక్స్ పర్ట్ చెప్పిన ప్రకారం చూస్తే..తలలో కొన్ని నేచురల్ ఆయిల్స్ ఉంటాయి. అవి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. కుదుళ్లు బలంగా ఉండడం వల్ల జుట్టు రాలే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే..కొంత మంది రెగ్యులర్ గా తలస్నానం చేస్తారు. లేదా వారానికి ఐదు నాలుగైదుసార్లు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఈ నేచురల్ ఆయిల్స్ తగ్గిపోతాయి. చాలా త్వరగా జుట్టు రాలిపోయే అవకాశాలుంటాయి. అందుకే..వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి.
తిన్న తరవాత
తిన్న తరవాత స్నానం చేయడం అనేది అసలు మంచి అలవాటు కాదు. దీని వల్ల బాడీ టెంపరేచర్ లో మార్పులు వచ్చి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవదు. అయితే..తలస్నానం చేయడం ఇంకా మంచిది కాదు. ఎందుకంటే తిన్న వెంటనే తలస్నానం చేస్తే కడుపులో తిప్పడంతో పాటు తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే తిన్న తరవాత కనీసం 45 నిముషాల పాటు ఆగాలి. ఆ తరవాతే తలస్నానం చేయాలి.
జలుబు ఉన్నప్పుడు
కొంతమంది జలుబు ఉన్నప్పుడు చిరాగ్గా ఉందని తలస్నానం చేస్తారు. అంతే కాదు. దగ్గు ఉన్నా సరే పట్టించుకోకుండే చేసేస్తారు. కానీ..ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు తలస్నానం చేయడం వల్ల ఆ సమస్యలు ఇంకా పెరుగుతాయి. జ్వరం ఉన్నప్పుడు కూడా తలస్నానం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇలా చేయడం వల్ల జ్వరం పెరిగే ముప్పు ఉంటుంది. బాడీ టెంపరేచర్ లో మార్పులు వస్తాయి. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తల తుడవడం
తలస్నానం చేసిన తరవాత ఏ విధంగా తల తుడుస్తున్నారు అనేది కూడా ముఖ్యమే. ఎక్స్ పర్ట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే..తలస్నానం తరవాత తలను చాలా సున్నితంగా తుడవాలి. చాలా మంది చాలా వేగంగా రఫ్ గా తుడుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ పాడవుతుంది. చర్మం దెబ్బ తింటుంది. కుదుళ్లు బలహీనమవుతాయి. ఫలితంగా చాలా త్వరగా వెంట్రులకు రాలిపోతాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే చాలా సాఫ్ట్ గా తలను తుడవాల్సి ఉంటుంది.
ఇది కూడా మర్చిపోకండి
జుట్టు ఆరబెట్టుకున్న తరవాత చాలా మంది అలాగే వదిలేస్తారు. కానీ..అలా వదిలేయడం వల్ల వెంట్రుకలు పాడవుతాయి. తలర ఆరిన వెంటనే జుట్టు దువ్వుకోవడం అసలు మరిచిపోకూడదు. రెగ్యులర్ గా జుట్టు దువ్వడం వల్ల వెంట్రుకలు సాఫ్ట్ గా మారతాయి. అంతే కాకుండా కురులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన అన్ని జాగ్రత్తలు పాటిస్తే జుట్టు రాలడం, చిట్లడం లాంటి సమస్యలు అసలు రానే రావు అని చెబుతున్నారు ఎక్స్ పర్ట్. అందుకే..ఈ సారి తలస్నానం చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా గుర్తు పెట్టుకుని ఫాలో అయిపోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa