ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ వినియోగదారులకు షాకిచ్చింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ.249 ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ను company రద్దు చేసింది.ఈ నిర్ణయం బుధవారం (ఆగస్టు 20) నుంచి అమల్లోకి రానుంది. జియో 1జీబీ డేటా ప్లాన్ను తొలగించిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్ కూడా ఇదే దారిలో నడిచింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, వొడాఫోన్ ఐడియా కూడా త్వరలో ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశముంది.ప్రస్తుతం రూ.249 ప్లాన్ ద్వారా 24 రోజుల పాటు అపరిమిత కాల్స్తోపాటు మొత్తం 1జీబీ డేటా లభిస్తున్నది. ఈ ప్లాన్ను తొలగించడంతో ఇకపై వినియోగదారులు కనీసం రూ.319 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది.ఇక వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం రూ.299కు రోజుకు 1జీబీ డేటా ప్లాన్ను అందిస్తోంది.
*జియోనే తొలి అడుగు:జియో ఇటీవల 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన రోజుకు 1జీబీ డేటా ప్లాన్ను నిలిపివేసింది. ఇప్పుడు 1.5జీబీ లేదా 2జీబీ డేటా ప్లాన్లే మిగిలినవి. జియో వెబ్సైట్లో ఇప్పటికే రూ.299 (1.5జీబీ/డే) మరియు రూ.349 (2జీబీ/డే) ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
*ARPU పెంపే లక్ష్యం:ఎంట్రీలెవల్ ప్లాన్లను తొలగించడం ద్వారా వినియోగదారులు తక్కువ మొత్తంలో ఎక్కువ డేటా కలిగిన ప్లాన్లకు మారు మారుతున్నారు. ఈ విధంగా టెలికాం కంపెనీలకు వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెరిగే అవకాశముంది.ఆధారంగా తీసుకుంటే, జియో వినియోగదారుల్లో సుమారు 20-25 శాతం మంది 1జీబీ ప్లాన్ను వాడేవాళ్లే. ఎయిర్టెల్ యూజర్లలో ఈ శాతం 18-20గా అంచనా. ఈ మార్పులతో టెలికాం సంస్థల ఆదాయం 4-7 శాతం వరకు, ARPU రూ.10-13 వరకు పెరగవచ్చని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa