ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాను భారత్‌ ఎందుకు దూరం చేసుకోలేదు? 7 కారణాలు చెప్పిన హర్ష్ గోయెంకా

business |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 09:07 PM

భారత్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని దెబ్బతీయడమే కాదు అమెరికా- భారత్ మధ్య బలమైన బంధాన్ని దెబ్బతీసేలా ఉందని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనడం ఆపేయాలని, లేదంటే భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అయినా భారత్ వెనక్కి తగ్గక పోవడంతో ఇటీవలే మన దేశంపై 25 శాతం అదనపు సుంకాలు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో అదనపు సుంకాలకు తెరలేపడం తీవ్ర చర్చకు దారి తీసింది.


అయితే, భారత్ ఎగుమతులపై అమెరికా సుంకాలు విధించవచ్చేమో గానీ దేశ సార్వభౌమత్వంపై కాదంటూ ఇటీవలే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌జీపీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా. ఈ విషయంపై తాజాగా మరోసారి స్పందించారు. ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో భాగస్వామ్యం భారత్‌కు ఎందుకు కీలకమో వివరించారు. అమెరికాను భారత్ ఎందుకు వదులుకోలేదో తెలిపారు. 7 కారణాలు చెప్తూ ఓ పోస్ట్ చేశారు.


ఇప్పటికీ అమెరికానే ఏకైక సూపర్ పవర్. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో, బలమైన మిలిటరీతో ప్రపంచాన్ని ప్రభావితం చేయగల దేశం.


భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికానే చైనా కాదు


అమెరికాతో భారత్‌కు 40 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. కానీ, చైనాతో మాత్రం 100 బిలియన్ డాలర్ల లోటు ఉంది.


భారత్‌కు అమెరికా వల్ల రక్షణ, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి.


కార్గిల్ యుద్ధం లాంటి సంక్షోభ సమయంలో మనకు అమెరికా అండగా ఉంది. కరవు వంటి సంక్షోభాల సమయంలో ఆహార పదార్థాలను పంపించింది.


మరోవైపు.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికాలో పర్యటిస్తారన్ని వార్తలు వచ్చాయి. అగ్రరాజ్యంతో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో మోదీ పర్యటిస్తారన్న వార్తలు రావడం గమనార్హం. సెప్టెంబర్ నెలలో న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి 80వ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరువుతున్నట్లు వార్తల సారాంశం. సెప్టెంబర్ 9వ తేదీన ఐరాస సమావేశాలు ప్రారంభం అవుతుండగా 23-29 తేదీల మధ్య ఉన్నత స్థాయి చర్చలు ఉంటాయి. 26వ తేదీన భారత ప్రభుత్వ అధిపతి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఐక్య రాజ్య సమితి తాత్కాలిక వక్తల జాబితా ప్రకారం తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa