ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈపీఎస్ 95 పై కేంద్రం సంచలన నిర్ణయం… రూ.9 వేల పింఛన్ వచ్చేనా?

national |  Suryaa Desk  | Published : Thu, Aug 21, 2025, 11:54 PM

ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌)తో సంబంధం ఉన్న అంశాల్లో ప్రస్తుతం కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. ఈపీఎఫ్‌ఓ (EPFO)కి చెందిన ఈపీఎస్‌–95 (Employees' Pension Scheme – 1995) పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది.లోక్‌సభలో కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 81 లక్షల మందికి పైగా పెన్షన్‌ అందుతున్నప్పటికీ, వారిలో కేవలం 0.65 శాతం మందికే నెలకు రూ.6,000 కంటే ఎక్కువ పెన్షన్‌ లభిస్తోందని వెల్లడించారు. 2024 మార్చి 31 వరకు అందిన గణాంకాల ప్రకారం, మాత్రమే 53,541 మంది పెన్షనర్లే రూ.6,000కు మించి పెన్షన్ పొందుతున్నారు.ప్రస్తుతం ఈ పథకం కింద కనీస పెన్షన్ రూ.1,000గా ఉండగా, దాన్ని రూ.9,000కు పెంచాలన్న డిమాండ్‌తో కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకంటే, రూ.1,500 కంటే తక్కువ పింఛన్ అందుకుంటున్నవారి సంఖ్య ఒక్కటే 49 లక్షలకు పైగా (కాగా ఇది మొత్తం పెన్షనర్లలో సగానికి పైగా). ఇది పెన్షనర్ల స్థితిగతులను ప్రతిబింబిస్తున్నదని చెప్పవచ్చు.2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్‌–95 కింద రూ.22,112 కోట్ల పైగా పెన్షన్ రూపంలో చెల్లించగా, 2023–24లో అది రూ.23,027 కోట్లకు పెరిగింది. అయితే మరోవైపు, రూ.10,898 కోట్లు ఖాతాల్లో వినియోగం లేకుండా మిగిలిపోతున్నట్లు కేంద్రం వెల్లడించింది.ఇక వడ్డీ ఆదాయంగా చూస్తే — 2022–23లో రూ.52,171 కోట్లుగా ఉన్న వడ్డీ ఆదాయం, 2023–24లో రూ.58,668 కోట్లకు పెరిగింది. అలాగే, జరిమానాలు, వాయిదాలు, ఇతర ఆదాయాల్లో కూడా రూ.564 కోట్ల నుంచి రూ.863 కోట్లకు వృద్ధి నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa