ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ పోలీస్ వ్యవహారంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ – డీజీపీకి నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 11:41 PM

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా ఎస్వీయూ క్యాంపస్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీకి మానవ హక్కుల జాతీయ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. సంఘటనపై ఆరు వారాల్లో నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది.ఈ ఘటనకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ చర్య తీసుకుంది. గతంలో ఈ ఘటనపై అధికారులు సమర్పించిన నివేదికలో, వైఎస్సార్‌సీపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పేర్కొంటూ, ఏపీ డీజీపీ నేరుగా బాధ్యతలు నివారించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.దాంతో, అసలైన వాస్తవాలను వెల్లడించేలా తాజా దర్యాప్తు నివేదికను సమర్పించాలి అంటూ మానవ హక్కుల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa