ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పటికీ సరి చేస్తున్నామన్న మంత్రి అనగాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 08:43 AM

రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి పొరపాట్లు లేకుండా సరికొత్తగా 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. పాస్ పుస్తకాల పంపిణీకి ముందు మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తామని ఆయన స్పష్టం చేశారు.గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పటికీ సరిదిద్దుతున్నామని ఆయన అన్నారు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు, అవగాహన సభల ద్వారా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను వంద శాతం పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "రైతులకు తప్పులు లేని పాస్ పుస్తకాలను అందించడం ప్రభుత్వ బాధ్యత. పాస్ పుస్తకాలతో రుణాలకు సంబంధం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం," అని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల ద్వారా భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa