సాధారణంగా రెస్టారెంట్లకు వెళ్లి తినే ఆహారంలో చిన్న చిన్న వస్తువులు, పురుగులు కనిపించడం సాధారణం. ఆహారంలో బొద్దింకలు, పురుగులు, బ్లేడులు, వెంట్రుకలు.. ఇలా అనేక రకాల వచ్చి వినియోగదారులు గొడవలు చేయడం గురించి మనం చాలానే చూశాం. అప్పుడప్పుడూ ఇలాంటివి మనకు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ వీటన్నింటి కంటే భిన్నమైనది ఓ మహిళకు వచ్చింది. ముఖ్యంగా ఆమె ఓ రెస్టారెంట్ నుంచి చికెన్ రాప్ ఆర్డర్ పెట్టుకుని.. ఆకలేస్తుందని ఆవురావురుమంటూ తినబోయింది. ఓ ముక్క కొరుక్కుని కూడా రుచి చూసింది. కానీ అప్పుడే ఆమెకు తింటున్న ఆ చికెన్ రాప్లో మనిషి వేలు కనిపించింది. దీంతో ఆమె షాక్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?
ఈ దారుణమైన ఘటన 2023లో న్యూయార్క్లోని అస్టోరియా ప్రాంతంలో జరిగింది. మాన్హాటన్కు చెందిన 43 ఏళ్ల మేరీ ఎలిజబెత్ స్మిత్ తరచుగా 'క్రియేట్ అస్టోరియా' అనే మెడిటరేనియన్ రెస్టారెంట్కు వెళ్లేది. వారానికి రెండుసార్లు అక్కడే భోజనం చేసే ఆమెకు.. ఆ రెస్టారెంట్ అంటే ఎంతో నమ్మకం. ఒక రోజు ఆమెకు బాగా ఆకలి వేయగా.. తనకిష్టమైన అదే హోటల్ నుంచి ఓచికెన్ రాప్ను ఆర్డర్ చేసింది. దాన్ని తినడం మొదలు పెట్టిన తర్వాత.. ఆమెకు నోటిలో ఏదో విచిత్రమైన, గట్టిగా ఉన్న పదార్థం తగిలింది. దీంతో అనుమానం వచ్చి దాన్ని బయటకు ఉమ్మి చూడగా.. ఆమెకు షాక్ తగిలింది. ముఖ్యంగా అది ఓ మనిషి వేలు అని తెలుసుకుని తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది.
ఆ భయంకరమైన సంఘటనతో మేరీ ఎలిజబెత్ స్మిత్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. కానీ వెంటనే ఆ వేలిని తీసుకెళ్లి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆ వేలి కొనను పరీక్షల కోసం ఒక ల్యాబ్కు పంపించగా.. అది మానవ వేలేనని, అది ఒక మహిళకు చెందినదని నిర్ధారణ అయింది. ఈ ఘటన తర్వాత ఆమెకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన వైరస్ నిరోధక చికిత్స అందించినట్లు ఆమె న్యాయవాది రాబర్ట్ మెన్నా వెల్లడించారు. మరోవైపు ఈ అమానవీయమైన నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ.. ఆమె రెస్టారెంట్పై భారీ పరిహారం కోరుతూ దావా వేసింది.
అయితే ఈ ఆరోపణలను రెస్టారెంట్ యజమాని టెడ్డీ కరాజియన్నిస్ పూర్తిగా ఖండించారు. ఈ దావా "మోసపూరితమైనది", "నిరాధారమైనది" అని ఆయన పేర్కొన్నారు. ఆ రోజు తమ రెస్టారెంట్లో ఏ మహిళా ఉద్యోగి కూడా పని చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ వేలి కొన డిఎన్ఎ పరీక్షకు మేరీ ఎలిజబెత్ స్మిత్ అంగీకరించలేదని కూడా ఆయన ఆరోపించారు. దీనివల్ల ఈ కేసులో ఉన్న అనుమానాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa