పహల్గా్మ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్లతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ను అన్ని రకాలుగా కోలుకోలేని దెబ్బ భారత్ కొట్టినా.. ఆ దేశం మాత్రం.. కుక్క తోక వంకర అన్న చందంగానే మళ్లీ తన పాత వైఖరిని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సరిహద్దుల్లో నిఘా పెట్టడం సంచలనంగా మారింది. పాకిస్తాన్కు చెందిన 6 డ్రోన్లు నియంత్రణ రేఖ వద్ద చక్కర్లు కొట్టడాన్ని భారత సైనిక అధికారులు గుర్తించారు. ఆదివారం రాత్రి.. పాక్ వైపు నుంచి 6 డ్రోన్లు వచ్చి.. కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టాయని.. ఆ తర్వాత తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లినట్లు తెలిపారు. డ్రోన్ల సంచారాన్ని గుర్తించిన ఇండియన్ ఆర్మీ.. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
అయితే గత కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు కనిపిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ డ్రోన్ల ద్వారా పాక్.. భారీగా ఆయుధాలు, డ్రగ్స్ను.. ఆ దేశం నుంచి భారత్లోకి పంపించిన ఘటనలు అనేకం కనిపించాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి.. కొన్ని డ్రోన్లు ఎల్ఓసీ వద్ద 5 నిమిషాల పాటు చక్కర్లు కొట్టడంతో.. సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలను సరిహద్దుల్లో విడిచిపెట్టి ఉంటాయా అనే కోణంలో భారత సైన్యం దర్యాప్తు చేస్తోంది. డ్రోన్లను గుర్తించిన సైన్యం.. సోమవారం భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది.
ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో నుంచి ఉగ్రవాదులు చొరబడకుండా భారత సైన్యం భద్రతను మరింత కట్టుదిట్టం చేయగా.. తాజాగా డ్రోన్లు కనిపించడం కలకలం రేపుతోంది. పాక్ డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు ఆపరేషన్ సిందూర్ తర్వాత.. బీఎస్ఎఫ్ అధికారులు సరికొత్త చర్యలు చేపట్టారు. భారత్, పాక్ సరిహద్దుల్లో డ్రోన్ స్క్వాడ్రన్ను ఏర్పాటు చేసిన బీఎస్ఎఫ్.. సరిహద్దు వెంబడి పెట్టడంతో పాటు.. పాక్ సైన్యం కదలికలను పరిశీలించడం, దాడుల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో ఈ డ్రోన్ స్క్వాడ్రన్ను ఉపయోగించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa