చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబరు 7న శ్రీవారి ఆలయం సుమారు 12 గంటల పాటు మూసివేయబడనుంది అని తితిదే ఒక ప్రకటనలో తెలిపింది. గ్రహణం ఆ రోజు రాత్రి 9.50 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1.31 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా గ్రహణ సమయానికి సుమారు 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేస్తారు.సెప్టెంబరు 8న ఉదయం 3 గంటలకు ఆలయం తలుపులు తిరిగి తెరిచి శుద్ధి మరియు పుణ్యహవచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. తరువాత తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం అనుమతిస్తారు.గ్రహణం రోజుని సాయంత్రం జరిగే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. అలాగే ఆ రోజు సాయంత్రం 3 గంటల నుంచి తిరుమలలో అన్నప్రసాద వితరణ నిలిపివేయబడుతుంది. సెప్టెంబరు 8న ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాద పంపిణీ మళ్లీ ప్రారంభించనుందని తితిదే వెల్లడించింది.భక్తుల సౌకర్యార్థం, తితిదే అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో 30,000 పులిహోర ప్యాకెట్లు సెప్టెంబరు 7న సాయంత్రం నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ ప్యాకెట్లు శ్రీవారి ఆలయం సమీపంలోని వైభోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద అందజేయబడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa