ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 ఆయుధాలకే పాక్ కాళ్లబేరానికి వచ్చింది: ఐఏఎఫ్ అధికారి

national |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 08:23 PM

 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేసింది. పాక్ ప్రతిదాడులు చేయగా దీటుగా బదులిచ్చి ప్రపంచం మొత్తం మన దేశం గురించి మాట్లాడుకునేలా చేసింది. అయితే తాజాగా ఆ ఆపరేషన్‌కు సంబంధించిన సరికొత్త విషయాలను ఎయిర్ స్టాఫ్ వైర్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ వెల్లడించారు. 50 కంటే తక్కువ ఆయుధాలను వాడగానే పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందని చెప్పారు.


ఆపరేషన్ సిందూర్ ప్రాముఖ్యత గురించి ఓ జాతీయ మీడియా సదస్సులో భారత వైమానిక దళం వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ మాట్లాడుతూ.. "యుద్ధాన్ని ప్రారంభించడం చాలా సులభం, కానీ దాన్ని ముగించడం అంత సులభం కాదు. ఆపరేషన్ సింధూర్‌లో కేవలం 50 కంటే తక్కువ ఆయుధాలను ఉపయోగించడం ద్వారానే మేము ప్రత్యర్థిని చర్చల బల్ల వద్దకు తీసుకురాగలిగాం. ఇది వైమానిక శక్తి యొక్క ఖర్చు-లాభ విశ్లేషణకు ఒక గొప్ప ఉదాహరణ" అని వ్యాఖ్యానించారు.


జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ముఖ్యంగా డ్రోన్లు, ఇతర సైనిక విమానాలతో అత్యంత కచ్చితత్వంతో ఉగ్రస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు పాకిస్థాన్ కూడా డ్రోన్లతో ఎదురు దాడులు చేసింది. అయితే భారత వైమానిక దళం అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి.


ఇవే విషయాలను చెబుతూ.. నర్మదేశ్వర్ తివారీ భారత వైమానిక దళం కేవలం 50 కంటే తక్కువ ఆయుధాలనే ప్రయోగించిందన్నారు. యుద్ధాన్ని ప్రారంభించడం సులువేనని.. కానీ దాన్ని ముగించడమే సులువైన పని కాదని చెప్పుకొచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేలా మోహరింపులు చేపట్టామన్నారు. నాలుగు రోజుల్లోనే పాకిస్థాన్ సీజ్ ఫైర్‌కు దిగొచ్చిందన్నారు.


ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిన దృశ్యాలతో పాటు మరికొన్ని కొత్తి విజ్యువల్స్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరగ్గా.. 29వ తేదీన ఉగ్ర లక్ష్యాలను షార్ట్ లిస్ట్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక మే 5వ తేదీన ఆపరేషన్ నిర్వహించాలనుకుంటున్న తేదీ, సమయం నిర్ణయం అయిందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa