గత కొంత కాలంగా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. అంతలా తెలియకుండానే టారిఫ్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇలా అన్నీ గతేడాది పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. టారిఫ్స్ విపరీతంగా పెంచేశాయి. గరిష్టంగా 25 శాతం వరకు పెంచాయి. దీంతో మొబైల్ రీఛార్జ్ మరింత భారమైంది. ఆ సమయంలో కూడా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) టారిఫ్స్ పెంచలేదు. ఇంకా ప్రత్యేక ఆఫర్లను తీసుకురాగా.. సబ్స్క్రైబర్లను పెంచుకుంది.
ఇటీవల ఎయిర్టెల్, జియో వంటివి 28 రోజుల పరిమితితో డైలీ 1 GB డేటా అందించే ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఎత్తేసినట్లు ఇప్పటికే ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. అధికారికంగా మాత్రం తెలియలేదు. ఇప్పటికీ BSNL లో మాత్రం చాలా తక్కువ ధరకే ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇతర వాటిల్లో అంటే 28 రోజుల వ్యవధికి కనీసం రూ. 299 నుంచి ఉన్నాయి. అయితే BSNL లో మాత్రం రూ. 200 లోపే ఉండటం విశేషం. ఇక్కడ రూ. 199 కే డైలీ 2 GB డేటాతో ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇటీవల ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో.. ఫ్రీడమ్ ప్లాన్ లాంచ్ చేసింది.
ఈ ప్లాన్ కింద కేవలం రూపాయికే ఉచితంగా సిమ్ అందిస్తోంది. ఇంకా అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లు, సహా రోజుకు 2GB డేటా అందిస్తుంది. ఇక్కడ వాలిడిటీ కూడా ఏకంగా 30 రోజులు ఉండటం విశేషం. ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుందని ముందే ప్రకటించింది. అంటే మరొక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పొచ్చు. అంటే ఆగస్ట్ 31 న ఈ ఆఫర్ కింద రూ. 1 తో సిమ్ తీసుకుంటే .. సెప్టెంబర్ 30 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. సెప్టెంబర్ 1 నుంచి మాత్రం ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని గుర్తుంచుకోవాలి.
మరోవైపు BSNL ఇటీవల.. OTT కంటెంట్, టీవీ ఛానెల్స్ ఆఫర్ చేస్తూ BITV లాంచ్ చేసింది. దీని ప్రీమియం ప్యాక్ ను తాజాగా ప్రకటించింది. ఇక్కడ రూ. 151 తోనే.. 25 కు పైగా OTT, 450 కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ అందిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa