ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ సంవత్సరం ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ఫ్రిబవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రణాళిక రెడీ చేసింది. ఇప్పటి వరకు ఇంటర్ విద్యార్థులకు మార్చిలో పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం మాత్రం సీబీఎస్ఈతో పాటే రాష్ట్రంలో కూడా ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరిలోనే నిర్వహించాలని ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇకపై ఏప్రిల్లో కొన్ని రోజులు పాటు ఫస్టియర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించేందుకు గాను.. ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అలానే పరీక్షల విధానంలో కూడా భారీ మార్పులు జరిగాయి.
గత సంవత్సరం వరకు కూడా ఒకే రోజు అన్ని గ్రూపుల విద్యార్థులకు ఎగ్జామ్ నిర్వహించేవారు. అంటే గతంలో ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు ఏదైనా సబ్జెక్ట్ పరీక్ష ఉంటే... అదే రోజు బైపీసీ, ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు. అయితే ఈ సంవత్సరం అలా ఉండదు. ముందుగా సైన్స్ విద్యార్థులకు వారి గ్రూపు సబ్జెక్ట్తో ఎగ్జామ్స్ మొదలువతాయి. రోజుకు ఒక్క సబ్జెక్ట్ పరీక్షే నిర్వహిస్తారు.
అంటే ఈ సంవత్సరం ఎంపీసీ అభ్యర్థులకు మ్యాథ్స్ పరీక్ష ఉంటే.. ఆ రోజు ఆ ఒక్క సబ్జక్ట్కు సంబంధించిన పరీక్ష మాత్రమే ఉంటుంది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంబైపీసీ గ్రూపును అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎంపీసీ విద్యార్థులు కూడా జీవశాస్త్రం చదివే అవకాశం లభించింది. దీంతో ఒకేరోజు రెండు పరీక్షలు రాయడానికి అవకాశం లేదు. అందుకే ఈ సంవత్సరం ఒకే రోజు ఒకే పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. సైన్స్ గ్రూపు సబ్జెక్టులన్నీ పూర్తయ్యాక చివర్లో లాంగ్వేజెస్ పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూప్ ఎగ్జామ్స్ మొదలవుతాయని తెలిపారు. అలానే ప్రాక్టికల్ పరీక్షలను జనవరిలో నిర్వహించాలా.. లేదంటే ఫైనల్ పరీక్షలు పూర్తయ్యాక పెట్టాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అలానే ఈ సంవత్సరం ఫస్టియర్లో అనేక సంస్కరణలు అమలు చేశారు. ఇంటర్ ఫస్టియర్లో ఈ సారి పూర్తిగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను అమలు చేస్తున్నారు. అలానే ఎంబైపీసీతో పాటుగా జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే అవకాశం కల్పించారు. ఆర్ట్స్ విద్యార్థులు కూడా ఆప్షనల్గా సైన్స్ సబ్జెక్టులు.. అలానే సైన్స్ గ్రూపు విద్యార్థులు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ దేనికైనా అర్హత సాధించేలా ఇలా సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కల్పించారు.
అలానే ఈ ఇయర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ పేపర్ విధానాన్ని కూడా మార్చారు. ఫిజిక్స్, కెమస్ట్రీ, జీవశాస్త్రం సబ్జెక్టుల పరీక్షలను 85 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. మిగతా 15 మార్కులను రెండో సంవత్సరం ప్రాక్టికల్స్కు ఉంటాయి. ఈ ఏడాది అన్ని పేపర్లలో కూడా వన్ మార్క్ ప్రశ్నలను కొత్తగా తీసుకురాబోతున్నారు. అలానే జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం 43, జంతుశాస్త్రం 42 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa