పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. బంగారం ధరలు ఒక్కరోజే భారీగా పెరిగాయి. గత ఐదు రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. మొత్తంగా తులం బంగారం రేటు రు.3000 వరకు పెరగగా ఇవాళ ఒక్కరోజే అందులో సగం మేర పెరగడం గమనార్హం. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.1640 మేర పెరిగి రూ. 1,04, 950 వద్దకు చేరుకుంది. ఇసక 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ.1500 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.96, 200 వద్దకు చేరుకుంది. అలాగే కిలో వెండి రేటు మరో రూ.1000 పెరిగింది. దీంతో కిలో ధర రూత.1,31,000 వద్దకు చేరుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa