ఏపీలో మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త.. కొత్త బార్ పాలసీ వచ్చేసింది.. గుడ్ న్యూస్ తెచ్చేసింది..(ఫోటోలు- Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి (సెప్టెంబర్ 1) నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. కొత్త బార్ పాలసీ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అంటే 2025 నుంచి 2028 వరకూ ఏపీలో నూతన బార్ పాలసీ అమల్లో ఉండనుంది. కొత్త బార్ పాలసీ ప్రకారం ఇకపై అర్ధరాత్రి 12 గంటలపాటు బార్లు తెరిచి ఉంచే అవకాశం బార్ల యజమానులకు ఉంటుంది. నూతన బార్ పాలసీ ప్రకారం ఉదయం పది గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ బార్లు తెరిచే ఉంచేందుకు అనుమతి ఉంటుంది. అయితే గతంలో ఏపీలో రాత్రి 11 గంటలకల్లా బార్లు మూసేయాల్సి ఉండేది. అయితే కొత్త విధానం ప్రకారం మరో గంట అదనంగా తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది. సోమవారం నుంచే కొత్త విధానం అమల్లోకి రానుంది.
మరోవైపు దేశంలోని చాలా రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ బార్లు తెరిచేందుకు అనుమతి ఉంది. ఏపీలో మాత్రం రాత్రి 11.00 గంటలకు బార్లను మూసి వేసేవారు. అయితే కొత్త బార్ పాలసీ అమల్లోకి రావటంతో అర్ధరాత్రి 12 గంటల వరకూ బార్లను నిర్వహించుకునేందుకు వీలు కల్పించారు. ముంబైలో రాత్రి ఒంటి గంటా 30 నిమిషాల వరకూ బార్లకు పర్మిషన్ ఉంటుంది. మన పొరుగున ఉన్న హైదరాబాద్లో రాత్రి 12.00 గంటల వరకూ అనుమతి ఉంది. ఇక బెంగళూరు విషయానికి వస్తే మామూలు రోజుల్లో రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకూ.. శుక్ర, శనివారాల్లో 1.00 గంట వరకు బార్లు, పబ్లు నిర్వహించుకునేందుకు అనుమతి ఉంది.
మరోవైపు ఏపీ కొత్త బార్ పాలసీ ప్రకారం.. క్వార్టర్ బాటిల్ రూ.99కి అమ్మే మద్యాన్ని.. బార్లలో అమ్మడానికి వీల్లేదు. అలాగే గీత కార్మికుల కోసం మొత్తం బార్లలో పది శాతం రిజర్వ్ చేశారు. 840 బార్లలో 84 బార్లను గీత కార్మికులకు కేటాయించారు. బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. ఆగస్ట్ 30వ తేదీతో ఈ గడువు ముగియగా.. తక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. లాటరీ విధానం ద్వారా బార్ల లైసెన్సులు కేటాయిస్తారు. అయితే లాటరీ తీయాలంటే ఒక్కో బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలనే నిబంధన విధించారు. దీంతో తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa