అఫ్గానిస్థాన్లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ భూకంపం వల్ల సుమారు 800 మందికి పైగా మరణించారని.. 2800 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. భూకంప తాకిడికి విలవిల్లాడుతున్న అఫ్టానిస్థాన్కు భారతదేశం ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు వచ్చింది. అఫ్గానిస్థాన్ భూకంప బాధితులను ఆదుకునేందుకు అత్యవసర సహాయక సామగ్రిని పంపింది.
యాసిడ్తో పనిలేదు టాయిలెట్ సీట్పై ఉన్న పసుపు మరకల్ని వదిలించే ఒకే ఒక చిట్కా, మరకలతో పాటు దుర్వాసన మాయం
ఈమేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేసింది. భూకంపం సంభవించిన నేపథ్యంలో అఫ్గానిస్థాన్కు భారతదేశం మానవతా సహాయం అందిస్తోంది అని ప్రకటించింది. అలానే ఇండియా నుంచి అఫ్గాన్ పంపుతున్న సహాయక సామగ్రి ఉన్న ట్రక్కుల ఫోటోలను కూడా షేర్ చేసింది. వీటిల్లో బియ్యం బస్తాలు, ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ కష్ట సమయంలో అఫ్గానిస్థాన్కు అండగా ఉంటామని భారతదేశం స్పష్టం చేసింది.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకారం అఫ్గానిస్థాన్లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.3 నమోదైంది. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని తెలుస్తోంది. అఫ్గానిస్థాన్ భూకంపం గురించి తాలిబాన్ అధికారి ఒకరు కీలక ప్రకటన చేశారు. ఇది గత దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన భూకంపం అని ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని తెలిపారు.
అఫ్గానిస్థాన్లో భూకంపం నేపథ్యంలో.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక ప్రకటన చేశారు. విపత్తు గురించి అఫ్గాన్ విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తఖితో మాట్లాడినట్లు తెలిపారు. భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి జైశకంర్ సంతాపం తెలిపారు. అలానే అఫ్గానిస్థాన్కు భారత్ ఇప్పటికే సహాయక సామగ్రిని పంపిందని వెల్లడించారు. 1000 కుటుంబాలకు సరిపడా టెంట్లు, 15 టన్నుల ఆహార పదార్థాలను కాబూల్ నుండి కునార్కు తరలించామని చెప్పారు. భారత రాయబార కార్యాలయం ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందన్నారు. ఈ మేరకు జైశంకర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
‘నేడు అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తఖితో మాట్లాడాను. భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను. భారతదేశం ఈరోజు కాబూల్లో 1000 కుటుంబాలకు సరిపడా టెంట్లు పంపింది. 15 టన్నుల ఆహార పదార్థాలను భారత మిషన్ ద్వారా కాబూల్ నుండి కునార్కు వెంటనే తరలిస్తున్నాము. రేపటి నుండి భారతదేశం నుండి మరింత సహాయక సామగ్రి పంపుతాము. భూకంపంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో భారతదేశం అఫ్గానిస్థాన్కు అండగా ఉంటుంది’ అంటూ జైశంకర్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa