అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. భర్త, బిడ్డలతో హాయిగా గడపాల్సిన ఆమె తనకంటే 10 ఏళ్ల చిన్నవాడైన ఓ మైనర్ బాలుడి ప్రేమలో పడింది. చాలా రోజులుగా వివాహేతర సంబంధం కూడా కొనసాగిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో మాత్రమే అతడిని కలవాల్సి రావడం.. కష్టంగా తోచడంతో ఇంట్లోంచి పారిపోదామని చెప్పింది. అందుకు బాలుడు కూడా అంగీకరించగా.. 17 ఏళ్ల బాలుడితో 27 ఏళ్ల వివాహిత పారిపోయింది. దాదాపు 600 కిలో మీటర్ల ప్రయాణించి అతడితో కాపురం పెట్టింది. మరి చివరకు ఏమైందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని అలప్పుళా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 27 ఏళ్ల మహిళకు కొన్నేళ్ల క్రితమే పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇంతకాలం భర్తతో సంతోషంగానే ఉన్న ఈమెకు కొన్ని నెలల క్రితం 17 ఏళ్ల బాలుడు పరిచయం అయ్యాడు. కొన్ని రోజుల్లోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అతడితో గడపాలనిపించినప్పుడుల్లా.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడిని పిలిపించుకునేది. ఇలా ఇన్నాళ్లూ కాలం వెళ్లదీస్తూ వచ్చారు. కానీ అతడితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నందుకు తెగ ఫీలైన మహిళ.. ఇంట్లోంచి పారిపోదాం, కలిసుందామని బాలుడితో చెప్పింది.
మహిళ మాటలు విన్న బాలుడు ఆమెతో వెళ్లేందుకు అంగీకరించాడు. ఇలా ఇద్దరూ కలిసి 15 రోజుల క్రితం కేరళలోని అలప్పుళా నుంచి దాదాపు 600 కిలో మీటర్లు ప్రయాణించి కర్ణాటకలోని కొల్లూర్కు చేరుకున్నారు. అయితే రోజంతా బాలుడు కనిపించకపోవడంతో భయపడ్డ అతడి తల్లిదండ్రులు వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ బాలుడి వద్ద ఫోన్ లేకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. కానీ స్థానికులను విచారించగా.. బాలుడు ఎక్కువగా పారిపోయిన మహిళతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. వారి ఇంటికి వెళ్లగా ఆమె కూడా కనిపించకపోవడంతో.. ఇద్దరూ కలిసే పారిపోయారనే నిర్ణయానికి వచ్చారు. కానీ మహిళ వద్ద కూడా ఫోన్ లేకపోవడంతో.. ఎక్కడికి వెళ్లారనే దానిపై క్లారిటీ రాలేదు.
అయితే ఇంట్లోంచి పారిపోయిన 12 రోజుల తర్వాత సదరు మహిళ.. తన బంధువులకు ఓ మెసేజ్ పంపించింది. తాను బెంగళూరులో ఉన్నట్లు చెప్పి.. తనకు ఇక భర్త అవసరం లేదని వివరించింది. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మెసేజీ వచ్చిన నెంబర్ ఆధారంగా పోలీసులు ఆమె జాడను గుర్తించారు. వెంటనే బాలుడు సహా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇరు కుటుంబాలను రప్పించి మాట్లాడారు. ఈక్రమంలోనే మహిళ తనకు భర్త వద్దని.. బాలుడితోనే ఉంటానని చెప్పింది. కానీ తల్లిదండ్రులతో మాట్లాడిన బాలుడు.. ఆమె పిలిస్తేనే వెళ్లాలని చెప్పడంతో కథ మలుపు తిరిగింది.
ముఖ్యంగా మైనర్ బాలుడిని మహిళ బలవంతంగా తీసుకెళ్లడంతో.. ఆమెపై పోక్సో కేసు పెట్టారు. మైనర్ను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం కావడంతో.. న్యాయస్థానం ఆమెను జ్యుడీషియల్ రిమాండ్కు పంపింది. మరోవైపు బాలుడిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa