ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 05:11 PM

అమరావతి మునిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారని హెచ్చరించారు. అమరావతి గురించి ఏసీ రూముల్లో కూర్చుని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అధారిటీ ఆమోదించిందని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ.ఇవాళ(ఆదివారం) అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ -1,టైప్ 2 ఇళ్లను పరిశీలించారు. పనుల పురోగతిపై సీఆర్డీయే ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. భూ సమీకరణతో రైతులకు ఎక్కువ లాభమని ఉద్ఘాటించారు. అమరావతిలో గెజిటెడ్, గ్రూప్-డీ అధికారుల కోసం మొత్తం 14 టవర్స్‌లో 1440 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa