ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ఈ పిటీషన్పై మరికాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న(శనివారం) బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో వీరి ముగ్గురికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు.లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ ఆర్డర్స్పై తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని సిట్ అధికారులు అంటున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ముగ్గురు నిందితుల బెయిల్ ఆర్డర్స్పై స్టే విధించాలని హై కోర్టును కోరనున్నారు సిట్ అధికారులు. ఈరోజు ఆదివారం కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. అయితే, ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్పై లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు సిట్ అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa