ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా 826 మంది సచివాల సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో నిరుద్యోగులను గుర్తించేందుకు కౌశలం సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కౌశలం సర్వే సక్రమంగా జరగడం లేదని తెలుసుకున్న కమిషనర్ భావన..సచివాలయం ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. .
అలానే కౌశలం సర్వే చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 826 మంది సచివాలయ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. కౌశలం సర్వే పనులు 55 శాతం మాత్రమే జరగడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా సచివాలయ సెక్రటరీలు కౌశలం సర్వే విషయంలో తమ నిరక్ష్య వైఖరి మానుకోవాలని ఆమె హెచ్చరించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తీసుకువచ్చిన ఈ సర్వేను నిర్లక్ష్యం చేయడం సరికాదని కమిషనర్ భావన సూచించినట్లు సమాచారం. ఇకనైనా సిబ్బంది సర్వే అంశంలో జాగ్రత్తగా పని చేయాలని సూచించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని నిరుద్యోగులను గుర్తించి.. వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కౌశలం సర్వే చేపడుతుంది. ఈ సర్వే ద్వారా.. నిరుద్యోగులు, విద్యార్థుల నైపుణ్య స్థాయిలను అంచనా వేసి.. ఆపైన వారికి అవసరమైన మేర ట్రైనింగ్ ఇచ్చి.. ఆ తర్వాత వారికి తగ్గట్టుగా జాబ్, ఉపాధి కల్పించడం ఈ కౌశలం సర్వే (వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే) ప్రధాన ఉద్దేశం.
ఆంధ్రప్రదేశ్కి చెందిన పది, ఇంటర్, డిప్లొమా నుంచి పీజీ వరకు చదివినవారు ఈ కౌశలం సర్వేలో వారి పేర్లు నమోదు చేసుకోవచ్చు. సర్వేలో పాల్గొన్న వారి అర్హతలను బట్టి ప్రభుత్వం వారికి నైపుణ్య అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ సర్వేలో పాల్గొనాలనుకునే వారు https://gsws-nbm.ap.gov.in/BM/workfromhome అనే పోర్టల్లోకి వెళ్లి తమ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే.. హోం పేజీ తెరుచుకుంటుంది. దానిలో వర్క్ ఫ్రమ్ హోం మాడ్యూల్ కనిపిస్తుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ మీద క్లిక్ చేయగానే ఆధార్ కార్డు వివరాలు అడుగుతుంది. వాటిని ఎంటర్ చేస్తే మొబైల్ నంబర్కి OTP వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక సర్వే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ అడిగిన వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేయాలి. అయితే పది, ఇంటర్ చదువుకున్న వారు మాత్రం ఎలాంటి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa