ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రెడ్ బుక్’ పాలనలో ప్రజలు తమ స్వేచ్చని కోల్పోయారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 05:37 PM

రాష్ట్రంలో పాలన ప్రజల కోసం కాకుండా దోపిడీదారుల కోసం సాగుతోందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి అప్పగించేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంతో పోలిస్తే తిరోగమనంలో ఉందని, ‘రెడ్ బుక్’ పాలనలో ప్రజలు తమ గొంతు విప్పే స్వేచ్ఛ కూడా కోల్పోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస బాధ్యతలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa