ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూఏఈ పై విజయం సాధించిన భారత్

sports |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 01:08 PM

బుధవారం యూఏఈతో జరిగిన ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూఏఈ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ను భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే వేస్తున్నాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్యాటర్ జునైద్ సిద్ధిఖీ, దూబే వేసిన బౌన్సర్‌కు అప్రమత్తమయ్యాడు. అదే సమయంలో బౌలర్ దూబే పరుగెడుతుండగా అతని నడుముకు ఉన్న టవల్ కిందపడిపోయింది. దీనిని గమనించి అంపైర్‌కు సూచిస్తూ సిద్ధిఖీ అజాగ్రత్తగా క్రీజు ముందుకు వచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్ వెంటనే బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్ చేశాడు.ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించగా, రీప్లేలలో సిద్ధిఖీ క్రీజు బయట ఉన్నట్లు స్పష్టంగా తేలింది. దీంతో అంపైర్ ఔట్‌గా ప్ర‌క‌టించారు. అయితే, సిద్ధిఖీ మైదానం వీడకుండా అక్కడే నిలబడి చూస్తుండగా, కెప్టెన్ సూర్యకుమార్ అంపైర్లతో చర్చించాడు. బౌలర్ టవల్ జారిపోవడం వల్లే బ్యాటర్ దృష్టి మరలిందని గ్రహించిన సూర్య, తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో సిద్ధిఖీ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa