అమెరికాలో సంచలనం సృష్టించిన రాజకీయ హత్యపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తన సన్నిహితుడు, ప్రముఖ కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ హత్యకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అందరినీ చట్టం ముందు నిలబెడతామని ప్రతినబూనారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారితో పాటు, దీని వెనుక నిధులు సమకూర్చి, మద్దతుగా నిలుస్తున్న సంస్థలను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.ఈ రోజు యూటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 31 ఏళ్ల చార్లీ కిర్క్ను దుండగులు కాల్చి చంపారు. యువతలో కన్జర్వేటివ్ భావజాలాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ హత్య అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.ఈ దారుణానికి 'రాడికల్ లెఫ్ట్' భావజాలమే కారణమని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. "కొన్నేళ్లుగా రాడికల్ లెఫ్ట్ వర్గాలు చార్లీ కిర్క్ వంటి గొప్ప అమెరికన్లను నాజీలతో, ప్రపంచంలోని అత్యంత క్రూరమైన నేరస్థులతో పోలుస్తున్నాయి. ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలే మన దేశంలో నేడు మనం చూస్తున్న ఉగ్రవాదానికి ప్రత్యక్ష కారణం. దీనికి వెంటనే అడ్డుకట్ట పడాలి" అని ట్రంప్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.చార్లీ కిర్క్ను ‘గొప్ప అమెరికన్ దేశభక్తుడు’గా అభివర్ణించిన ట్రంప్ ఆయనకు నివాళిగా ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను అవనతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. "గొప్ప వ్యక్తి, యువతతో అంతగా మమేకమైన చార్లీ కిర్క్ ఇక లేరు. ఇది అమెరికాకు చీకటి రోజు" అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa