కాకినాడలో సముద్రపు ఉధృతి తీవ్రంగా పెరిగింది. అనూహ్యంగా ఎగిసిపడుతున్న కెరటాలు పట్టణాన్ని ఆవరించాయి. తాజాగా సుబ్బంపేట దాకా సముద్రపు నీరు చొచ్చుకువచ్చినట్లు సమాచారం. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రకృతి వీరంగా విరుచుకుపడుతోంది.
బీచ్ రోడ్డు వద్ద భారీ నష్టం చోటుచేసుకుంది. కెరటాల ప్రభావంతో కాకినాడలో రోడ్లు ధ్వంసమయ్యాయి. రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అనేక ప్రాంతాల్లో బీచ్ రోడ్డుకు సమీపంగా ఉన్న ఇళ్లకు నీరు చేరింది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఉప్పాడ తీరంలో అలలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. ఇది తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. జలప్రళయాన్ని తలపించే విధంగా సముద్రం క్షణక్షణానా ఉగ్రరూపం దాలుస్తోంది. ఉపద్రవ ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు శాఖల బలగాలు మోహరించాయి.
సురక్షిత ప్రాంతాలకు తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులు. ప్రజలకు తక్షణమే తీర ప్రాంతాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచనలు జారీ చేశారు. మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హై అలర్ట్లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa