ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్పపీడనంతో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 12:02 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూర ు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. గురువారం సాయంత్రం వరకు నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 60.2, ఎనకండ్లలో 52.2, పాములపాడులో 38.7, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 34.7, విజయనగరం జిల్లా గొల్లపాడులో 33.2 మిల్లీమీటర్ల వాన పడింది. కాగా, వాయవ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణకు వాతావరణం అనుకూలంగా మారుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa