ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు మంచి ఛాన్స్..సీఎస్ఈ‌లో సీట్లు మిగిలిపోయాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 07:30 PM

ఇంజనీరింగ్.. మన దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది యువత ఎంచుకునే కెరీర్ ఆప్షన్. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ కొలవులు సంపాందించాలనే ఆశతో ఎంతో మంది యువత ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఇక ఇంజనీరింగ్‌లోనూ ఎవర్‌గ్రీన్ డిమాండ్ ఉన్న కోర్సు ఏదంటే.. ఠక్కున చెప్పేది సీఎస్‌ఈ.. ఆ తర్వాత ఈసీఈ వంటి కోర్సులవైపు విద్యార్థులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీంతో కాలేజీ అడ్మిషన్ల సమయంలో సీఎస్ఈ కోర్సుకు భారీగా డిమాండ్ ఉంటూ వస్తోంది. కన్వీనర్ కోటా కింద సీఎస్ఈ సీటు రాకపోతే.. లక్షలు కట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందే వారిని కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇంతటి డిమాండ్ ఉన్న సీఎస్ఈ కోర్సు సీట్లు కూడా మిగిలిపోవటం గమనార్హం. ఈ పరిస్థితి ఆంధ్రా యూనివర్సిటీలో నెలకొంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ (ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్) ఈ ఏడాది సీఎస్ఈ కోర్సులో సీట్లు మిగిలిపోయాయి.


రెండు విడతల ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యేసరికి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలోని 14 కోర్సులలో 95 సీట్లు మిగిలిపోయాయి. అందులో సీఎస్ఈ కోర్సులోనే 22 సీట్లు ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఈఏపీసెట్‌-2025 ద్వారా ఇంజనీరింగ్ సీట్ల భర్తీ చేపడుతున్నారు. అయితే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి అయ్యింది. విద్యార్థులు ఇంజినీరింగ్‌ సీట్లలో చేరికలకు సెప్టెంబర్ 6వ తేదీ వరకూ గడువిచ్చారు. అయితే సీట్లలో చేరేందుకు ముందుకు రాకపోవటంతో ఇంజనీరింగ్ సీట్లు మిగిలియపోయాయి. దీంతో మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.


అయితే ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ సీట్లు మిగిలిపోవటానికి అక్కడి ప్రొఫెసర్లు పలు కారణాలు చెప్తున్నారు. కౌన్సిలింగ్‌లో సీట్లు వచ్చిన విద్యార్థులు.. ఆ తర్వాత ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో సీట్లు పొందటంతో అటు వైపు వెళ్లిపోయారని చెప్తున్నారు. ఒక్క ఆంధ్రా యూనివర్సిటీ మాత్రమే కాదని. మిగతా విశ్వవిద్యాలయాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని.. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీ ఆచార్యులు సూచిస్తున్నారు. అయితే ఎంతో డిమాండ్ ఉన్న సీఎస్ఈ కోర్సులోనూ సీట్లు భర్తీ కాకపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. యువత అభిరుచి మారుతోందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa